Asia Cup: చరిత్ర సృష్టించిన ఒమన్.. టోర్నమెంట్ నిర్వహణలో భారత్ తో పోటీ

Asia Cup
x

Asia Cup: చరిత్ర సృష్టించిన ఒమన్.. టోర్నమెంట్ నిర్వహణలో భారత్ తో పోటీ

Highlights

Asia Cup: భారతదేశం రెండు పెద్ద టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఒక వైపు టీ 20 ప్రపంచకప్ ను 2026లో నిర్వహిస్తోంది.

Asia Cup: భారతదేశం రెండు పెద్ద టోర్నమెంట్లకు ఆతిథ్యం ఇస్తోంది. ఒక వైపు టీ 20 ప్రపంచకప్ ను 2026లో నిర్వహిస్తోంది. అలాగే ఈ సంవత్సరం ఆసియా కప్ ఆడతారు. ఈ టోర్నమెంట్‌లో ఆసియా నుండి 8 జట్లు పాల్గొంటాయి. దీనికి ఒమన్ అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. ఈ దేశం జనాభా కేవలం 54 లక్షలు మాత్రమే. అత తక్కువ జనాభా ఉన్న ఈ దేశం తొలిసారిగా ఆసియా కప్‌లోని ఏ ఫార్మాట్‌ లోనైనా నిర్వహించేందుకు అర్హత సాధించింది. ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ 2024లో టాప్-2 జట్ల జాబితాలో చేరడం ద్వారా ఒమన్ ఈ ఘనతను సాధించింది. ఇప్పుడు అది 2025 ఆసియా కప్‌లో భారతదేశాన్ని సవాలు చేస్తున్నట్లు చూడవచ్చు.

ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ 2024లో ఒమన్ జట్టు దుబాయ్, కువైట్, బహ్రెయిన్ , కంబోడియా వంటి జట్లతో పాటు గ్రూప్ Bలో స్థానం పొందింది. అది గ్రూప్ దశలో టాప్-2లో ఉండి సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత వన్ సైడ్ మ్యాచ్‌లో హాంకాంగ్‌ను ఓడించి, ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, టైటిల్ మ్యాచ్‌లో దుబాయ్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అది దుబాయ్, హాంకాంగ్ లతో పాటు టోర్నమెంట్లో టాప్ 3 జట్లలో నిలిచింది. 2025 ఆసియా కప్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఒమన్ తొలిసారి ఈ టోర్నమెంట్‌లోకి ప్రవేశించడం ద్వారా చరిత్ర సృష్టించింది.

2025 ఆసియా కప్‌లో 8 జట్లు పాల్గొంటాయి. వీటిని 4 జట్లుగా రెండు గ్రూపులుగా విభజించారు. ఈ సమయంలో ఒమన్, భారతదేశం మధ్య మ్యాచ్ ఉండవచ్చు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈసారి భారతదేశం, పాకిస్తాన్ కూడా కలిసి ఉంటాయి. దీని తరువాత సూపర్-4 దశ మ్యాచ్‌లు ఆడతారు. ఈ రౌండ్‌కు రెండు జట్లు అర్హత సాధిస్తే, వారు మరోసారి ఒకరినొకరు ఎదుర్కోవచ్చు. ఈ రౌండ్‌లో మొదటి, రెండవ స్థానాలు సాధించిన జట్లు ఫైనల్‌కు చేరుకుంటాయి. సూపర్-4లో భారత్, పాకిస్తాన్ జట్లు టాప్-2లో కొనసాగగలిగితే, వారు ఫైనల్‌లో కూడా ఢీకొనే అవకాశం ఉంది.

ఈ టోర్నమెంట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చినప్పటికీ ఒకే వేదికలో జరుగుతుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న వివాదం కారణంగా.. మ్యాచ్ తటస్థ వేదికలో ఆడాలని అంగీకరించింది. కానీ ఆతిథ్య హక్కులు..బీసీసీఐ వద్దనే ఉంటాయి. తదుపరిసారి భారతదేశం లేదా పాకిస్తాన్ టోర్నమెంట్‌ను నిర్వహించే వంతు వచ్చినప్పుడు.. దానిని ఏదైనా మూడవ దేశంలో నిర్వహిస్తారు. మరోసారి, దీనికి దుబాయ్ లేదా శ్రీలంక ఎంపిక ను సెలక్ట్ చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories