వరల్డ్ రికార్డు సృష్టించిన క్రికెటర్

వరల్డ్ రికార్డు సృష్టించిన క్రికెటర్
x
Highlights

అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఫార్మట్‎లో నేపాల్‌ జట్టు టీమ్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఆదేశం తరపున సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ అయ్యాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్ ఫార్మట్‎లో నేపాల్‌ జట్టు టీమ్‌ కెప్టెన్‌ పరాస్‌ ఖడ్కా రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఆదేశం తరపున సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ అయ్యాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో మ్యాచ్‌లో నేపాల్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సింగపూర్‌ పరిమిత ఓవర్లలో 3 వికెట్లకు 151 పరగులు చేసింది. సింగపూర్ జట్టులో డేవిడ్ మూడు ఫోర్లు, నాలుగు సిక్స్లతో 64 పరుగులు సాధించాడు. చంద్రమోహన్ 35 పరుగులతో రాణించాడు. 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. నేపాల్ కెప్టెన్‎గా ఖడ్కా సెంచరీ చేసి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, 9 సిక్సర్లుతో సెంచరీ సాధించాడు. దీంతో 152 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి నేపాల్‌ చేధించింది. ఓపెనర్ ఆరిఫ్ 38 బంతుల్లో ఐదు ఫోర్లు నాలుగు సిక్స్‎లు సాధించి 39 పరుగులతో నాటౌట్‎గా నిలిచాడు. ఇరువురి మధ్య రెండోవికెట్కు 145 పరుగుల భాగస్వామ్యం నెలకొప్పారు. నేపాల్ జట్టు అక్టోబర్ 1న జింబాబ్వేతో తలపడనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories