IPL 2025: ముంబైతో పోరుకు ముందు వివాదంలో LSG..సంజీవ్ గోయెంకా నిర్ణయం తప్పా?

LSG Skip Post Match Presentation After Punjab Loss
x

IPL 2025: ముంబైతో పోరుకు ముందు వివాదంలో LSG..సంజీవ్ గోయెంకా నిర్ణయం తప్పా?

Highlights

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ సీజన్‌లో మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయింది.

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఈ సీజన్‌లో మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిపోయింది. లక్నోలోని తమ సొంత మైదానంలో పంజాబ్‌తో ఓడిపోవడంతో, ఆ మ్యాచ్ తర్వాత పెద్ద వివాదం తెరపైకి వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి తర్వాత మ్యాచ్ ప్రెజెంటేషన్ సెర్మనీకి దూరంగా ఉందని, ఇదంతా కావాలనే చేశారని ఆరోపణలు వస్తున్నాయి. మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు లక్నో యజమాని సంజీవ్ గోయెంకా వెళ్లాల్సి ఉండగా.. ఆయన మైదానంలో కూడా ఉన్నప్పటికీ ఓటమి తర్వాత ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెబుతున్నారు.

లక్నో మ్యాచ్‌లో ఏం జరిగింది?

నివేదికల ప్రకారం, LSG పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్‌కు తమ తరఫున ఎటువంటి అధికారిని పంపలేదు. హోమ్ టీమ్‌గా వారు అలా చేయడం తప్పనిసరి. మ్యాచ్ తర్వాత యజమాని సంజీవ్ గోయెంకా, కొంతమంది అధికారులు మైదానంలో ఉన్నారు.. కానీ ఎవరూ అధికారికంగా ప్రెజెంటేషన్‌లో పాల్గొనలేదు. అయితే, LSGకి చెందిన ఒక వర్గం మాత్రం అలాంటి ఏర్పాటు ఏమీ లేదని వాదించింది. "శ్రీ గోయెంకా మైదానంలో ఉన్నారు, కానీ పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ కోసం ఎటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయలేదు" అని వారు అన్నారు.

కానీ దీనికి విరుద్ధంగా, మరో వర్గం సంజీవ్ గోయెంకా పేరు పోస్ట్-మ్యాచ్ ప్రెజెంటేషన్ అతిథుల జాబితాలో ఉందని, కానీ తర్వాత దానిని రద్దు చేశారని పేర్కొంది. "అలా అయితే, LSG తమ అధికారిని ఎవరినైనా ప్రెజెంటేషన్‌కు పంపించాల్సింది కదా" అని వారు ప్రశ్నించారు. LSG ఈ సీజన్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, వాటిలో రెండింటిలో ఓటమిని చవిచూసింది. వారు తమ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో 1 పరుగు తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించారు. కానీ తర్వాతి మ్యాచ్‌లోనే PBKS చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు LSG తదుపరి మ్యాచ్ ముంబై ఇండియన్స్ (MI)తో లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగనుంది. ఈ ఓటమి నుండి రిషబ్ పంత్, అతని జట్టు ఎలా పుంజుకుంటారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories