మరోసారి ఘోర పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌

మరోసారి ఘోర పరాజయం పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌
x
Highlights

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరోసారి ఘోర పరాజయం పాలైంది. ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌ తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. మొదట బ్యా టింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. వార్నర్‌ (62 బంతుల్లో 70 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. అశ్విన్, షమీ, ముజీబుర్‌ తలా ఒక వికెట్‌ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి గెలిచింది.

రాహుల్‌ (53 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ (43 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. సందీప్‌ శర్మకు 2 వికెట్లు దక్కాయి. అనంతరం 151 పరుగుల లక్ష్య చేధన కోసం బరిలోకి దిగిన పంజాబ్ జట్టు మరో బంతి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బ్యాటింగ్‎లో రాహుల్(71) నాటౌట్ ,అగర్వాల్(55) అదరగొట్టేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories