బుమ్రా, స్మృతి మంధానకు ప్రతిష్టాత్మక పురస్కారాలు

బుమ్రా, స్మృతి మంధానకు ప్రతిష్టాత్మక పురస్కారాలు
x
Highlights

భారత క్రికెట్ జట్టు బౌలర్ జస్ప్రిత్‌ బుమ్రా , మహిళా క్రికెట్ జట్టు బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధానకు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.

భారత క్రికెట్ జట్టు బౌలర్ జస్ప్రిత్‌ బుమ్రా , మహిళా క్రికెట్ జట్టు బ్యాట్స్‌వుమన్‌ స్మృతి మంధానకు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. ఈ సంవత్సరాగాను విజ్డెన్‌ ఇండియా అల్మానక్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ పురస్కారాలు వరించాయి. ఈ పురష్కారాలు మొత్తం ఐదుగురికి లభించాయి. పాకిస్థాన్ కు చెందిన జమాన్, శ్రీలంకకు చెందిన కరుణరత్నే, అఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్‌కు పురస్కారాలకు ఎంపికైయ్యారు. ఈ పురస్కారానికి ఎంపికైన మూడో టీమిండియా మహిళా క్రికెటర్‌గా స్మృతి ఘనత సాధించారు. అంతకుముందు విథాలి రాజ్, దీప్తి శర్మ ఈ పురస్కారాలకు దక్కించుకున్నారు.

మొత్తం ఐదుగురికి లభించిన ఈ పురస్కారాల్లో ఇద్దరు ఇండియా క్రికెటర్లు ఉండడం విశేషం. ఇక సౌతాఫ్రికాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో డబుల్‌ సెంచరీ చేసిన మాయంక్‌ అగర్వాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2019-2020 సంవత్సరానికిగాను 7వ విజ్డెన్‌ వార్షిక ముద్రణాల్లో మయాంక్‌ కథనాలు వచ్చాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories