IPL2021 Auction:ముగిసిన వేలం..ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా ఇదే

IPl 2021 Auction
x

ఐపీఎల్ 2021

Highlights

IPL 2021 Auction: ఐపీఎల్2021మీని వేలం ముగిసింది.

IPL 2021 Auction:ఐపీఎల్2021మీని వేలం ముగిసింది. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు కోట్ల రూపాయాలను ఆర్జిస్తున్నారు. ఈ సీజన్ లో మొత్తం 57 మంది ఆటగాళ్లను ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. వారితో 22 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ వేలంలో విదేశీ ఆటగాళ్లు అత్యధిక ధరకు అమ్ముడుపోయారు. టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా ఎట్టకేలకు ఐపీఎల్ అడే అవకాశం వరించింది. దీంతో ఇతను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. అత్యధిక ధర పలికిన వారిలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ ఉన్నాడు.

ఏ జట్టులో ఎవరు చూద్దాం

ఢిల్లీ క్యాపిటల్స్‌

ఆసీస్ బ్యాట్స్ మెన్ మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 2కోట్ల 20 లక్షల దక్కించుకొంది.

ఇంగ్లాండ్‌ ఆటగాడు టామ్‌ కరన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.5.25 కోట్లకు దక్కించుకుంది.

టీమ్‌ఇండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను రూ.1కోటీ రూపాయలకే ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ డాన్‌ క్రిస్టియన్‌ను బెంగళూరు రూ.4.8 కోట్లకు సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరురూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది.

కివీస్ ఆటగాడు కైల్‌ జేమిసన్‌ను బెంగళూరు రూ.15 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

ఆంధ్రా వికెట్‌ కీపర్‌ కేఎస్ భరత్‌ను బెంగళూరు రూ.20 లక్షలకు దక్కించుకుంది.

పంజాబ్‌ కింగ్స్‌

ఆసీస్‌ పేసర్‌ జే రిచర్డ్‌సన్‌‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.14 కోట్లకు దక్కించుకుంది.

ఆస్ట్రేలియా యువపేసర్ మెరెడిత్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.8 కోట్లుకు దక్కించుకుంది.

ఆస్ట్రేలియా మోజెస్‌ హెన్రిక్స్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.4.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్‌ మలన్‌ రూ.1.5 కోట్లకే పంజాబ్‌ కింగ్స్‌ దక్కించుకుంది.

వెస్టిండీస్‌ పవర్‌ హిట్టింగ్‌ ఆల్‌రౌండర్‌ ఫాబియన్‌ అలన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ.75 లక్షలు

తమిళనాడు ఫినిషర్‌ షారుక్‌ ఖాన్‌ రూ.5.25 కోట్లు పెట్టి పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది.

ముంబయి ఇండియన్స్‌

ఆసీస్‌ పేసర్‌ నేథన్‌ కౌల్టర్‌ నైల్‌ను ముంబయి రూ. 5 కోట్లు దక్కించుకుంది.

న్యూజిలాండ్‌ పేసర్‌ ఆడమ్‌ మిల్న్‌ను రూ. 50లక్షలకు సొంతం చేసుకుంది.

ముంబయి పియూష్‌ చావ్లాకు రూ.2.4 కోట్లులకు కొనుగోలు చేసింది.

అర్జున్‌ తెందూల్కర్ ముంబయి రూ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

రాజస్థాన్‌ రాయల్స్‌

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌మోరిస్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.16.25 కోట్లకు దక్కించుకుంది.

టీమిండియా బ్యాట్స్ మెన్ శివమ్‌ దూబెను రూ.4.4 కోట్లతో రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది.

బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ను రాజస్థాన్ కొలుగోలు చేసింది.

సౌరాష్ట్ర పేసర్‌ చేతన్‌ సకారియాను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ.1.2 కోట్లకు దక్కించుకుంది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌

ఇంగ్లాండ్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.7 కోట్లకు మొయిన్‌ అలీని కొనుగోలు చేసింది.

టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారా చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.

కర్ణాటక ఆఫ్‌స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృష్ణప్ప గౌతమ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడిని రూ.9.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌

బంగ్లా ఆల్ రౌండర్ షకిబ్‌ అల్‌ హసన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది.

పవన్‌ నేగిని రూ.50 లక్షలకు కోల్‌కతా దక్కించుకుంది.

టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను రెండు కోట్లు

వెంకటేష్ అయ్యార్ రూ.50 లక్షలు

బెన్ 75 లక్షలు

కురాన్ నాయర్ రూ.50 లక్షలు

వైభవ్ అరోరా రూ. 20 లక్షలు

షెల్డన్ జాక్సన్ రూ. 20లక్షలు

సర్ రైజర్స్ హైదరాబాద్

కేదర్ జాదవ్ ను రూ.2కోట్లు

మూజీబ్ రెహ్మాన్ ను రూ. 1.5 కోట్లు

జగదీష్ సుచిత్ కనీస ధర 30 లక్షలు కోనుగోలు చేసింది.

ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌, కొనుగోలు చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. కివీస్‌ స్పిన్నర్‌ ఇష్‌ సోదీని కూడా కొనుగోలు చేయలేదు. భారత జట్టు కీలక ఆటగాడు హనుమ విహారిని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ కు మొండిచేయి ఎదురైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories