IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025 విన్నర్ బెంగళూరు.. ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ అందుకుందో తెలుసా?

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Jun 2025 6:40 AM IST
IPL 2025 winner Bangalore Do you know how many crores of prize money they received
X

IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025 విన్నర్ బెంగళూరు.. ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ అందుకుందో తెలుసా?

IPL 2025 Prize Money: ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్ ను 6 పరుగులతో ఓడించి విజయం సాధించింది. టైటిల్ పోరులో ఆర్సీబీ 190 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా పంజాబ్ జట్టు 184 పరుగులు చేసింది. ఫలితంగా ఆర్సీబీ మొదటిసారి ఐపీఎల్ గెలిచే ఛాన్స్ దక్కింది. ఐపీఎల్ లో చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ 17ఏళ్ల కల నెరవేరింది. ఐపీఎల్ గెలిచినందుకు ఆర్సీబీకి ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2025 ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీకి ప్రైజ్ మనీగా రూ. 30కోట్లు లభించాయి. ఈ మ్యాచులో ఆర్సీబీ జట్టు బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణించింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు ఈ మ్యాచులో గెలవనప్పటికీ రన్నరప్ గా నిలిచి రూ. 13కోట్లు అందుకుంది.

ఈ టోర్నమెంట్లో ఆర్సీబీని గెలిపించిన ఘనత అందులోని ప్రతి ఆటగాడికీ దక్కుతుంది.ఆర్సీబీ తన సొంతగడ్డ వెలుపల జరిగిన అన్ని మ్యాచులను గెలిచిన మొదటి జట్లు, 9 మంది వేర్వేరు ఆటగాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. ఆర్సీబీ విజయానికి అతిపెద్ద సహకారం విరాట్. తన జట్టు తరపున అత్యధికంగా 657 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో విరాట్ 8 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని బ్యాటింగ్ సగటు 54 కంటే ఎక్కువని చెప్పవచ్చు. విరాట్ తర్వాత ఫిల్ సాల్ట్ 403 పరుగులు చేశాడు. పాటిదార్ 312, జితేష్ శర్మ 261 పరుగులు చేశాడు. బౌలింగ్ లో హాజెల్ వుడ్ అత్యధికంగా 22 వికెట్లు పడగొట్టాడు. క్రునాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ కూడా తలో 17 వికెట్లు పడగొట్టారు. యష్ దయాల్ 13వికెట్లు తీసుకున్నాడు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story