
IPL 2025: ఇబ్బందుల్లో గుజరాత్ టైటాన్స్.. గాయంతో స్టార్ ప్లేయర్ నిష్క్రమణ
IPL 2025 : ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు జరిగాయి. ఈ సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
IPL 2025 : ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 25 మ్యాచ్లు జరిగాయి. ఈ సమయంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టులోని కీలక ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ గాయం కారణంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ అయిన గ్లెన్ ఫిలిప్స్ను గుజరాత్ టైటాన్స్ మెగా వేలంలో కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే, అతను ఒక్క మ్యాచ్లో కూడా జట్టు తుది 11లో ఎంపిక కాలేదు. ఏప్రిల్ 6న సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గ్లెన్ ఫిలిప్స్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఫిలిప్స్ గుజరాత్ తరఫున సబ్స్టిట్యూట్గా మైదానంలోకి వచ్చాడు. ఒక త్రో విసిరే ప్రయత్నంలో అతని కండరాలలో గాయం ఏర్పడింది. ఆ తర్వాత సహచరుల భుజాలపై ఆధారపడి మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ గాయం కారణంగా అతను జట్టు ప్రాక్టీస్లో కూడా కనిపించలేదు.
శనివారం (ఏప్రిల్ 12) మధ్యాహ్నం శుభ్మన్ గిల్ జట్టు లక్నో సూపర్ జెయింట్తో మ్యాచ్ ఆడనుంది. ఇలాంటి సమయంలో ఫిలిప్స్ జట్టును వీడడం పెద్ద ఎదురుదెబ్బ. ఫిలిప్స్ వెళ్ళిపోవడంతో గుజరాత్ టెన్షన్ పెరిగింది. ఇంతకు ముందు కగిసో రబాడా కూడా దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్ళాడు. అతను జట్టులో ఎప్పుడు చేరతాడనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. దీంతో గుజరాత్ జట్టులో ప్రస్తుతం జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, రషీద్ ఖాన్, గెరాల్డ్ కోయెట్జీ, కరీం జనత్ అనే ఐదుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. అయితే, జట్టు ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. వారు 5 మ్యాచ్లలో 4 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితిలో గుజరాత్ టైటాన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఎలా రాణిస్తుందో చూడాలి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




