IPL 2021:టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై

Rohit Sharma Kohli File Photo
x

రోహిత్, కోహ్లీ ఫైల్ ఫోటో

Highlights

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభమైంది. తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా...

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆరంభమైంది. తొలి పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన విరాట్‌ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఆరంభించిన రోహిత్ సేన నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24పరుగులు చేసింది. రోహిత్(19)రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. క్రీజులో క్రిస్‌లిన్(5) ఉన్నారు. కాగా, తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సీజన్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. దాంతో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు యుజువేంద్ర చాహల్‌కు ఇది వందో ఐపీఎల్‌ మ్యాచ్‌.

ముంబయి ఇండియన్స్‌ జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), క్రిస్‌లిన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, కీరన్‌ పొలార్డ్‌, కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌, మార్కో జెన్సన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్‌ బుమ్రా

రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు:

విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, రజత్‌ పాటిదార్‌, డేనియెల్‌ క్రిస్టియన్, గ్లెన్‌ మాక్స్‌వెల్, వాషింగ్టన్‌ సుందర్‌, కైల్‌ జేమీసన్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, యుజ్వేంద్ర చాహల్‌



Show Full Article
Print Article
Next Story
More Stories