ఐపీఎల్ మినీ వేలం.. వేదిక ఎక్కడంటే?

ఐపీఎల్ మినీ వేలం.. వేదిక ఎక్కడంటే?
x
Highlights

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్‌) 2021 సీజన్ 14 మినీ వేలం తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా మినీ వేలం నిర్విహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్‌...

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్‌) 2021 సీజన్ 14 మినీ వేలం తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా మినీ వేలం నిర్విహించనున్నారు. ఈ విషయాన్ని ఐపీఎల్‌ నిర్వాహకులు ట్విటర్ వేదికగా వెల్లడించారు. 'అలెర్ట్‌.. ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం చెన్నై వేదికగా జరుగుతుంది' అని ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

కాగా.. టోర్నీలోని ఎనిమిది ఫ్రాంఛైజీలు రిటైన్, వేలంలోకి వదిలేసిన ఆటగాళ్ల జాబితాని బీసీసీఐకి సమర్పించాయి. కాగా, ఈ వేలంలో అత్యధిక డబ్బుతో కింగ్స్ పంజాబ్ బరిలోకి దిగనుంది. కింగ్స్‌ ఎల్‌వెన్ పంజాబ్‌ వద్ద రూ. 53.2 కోట్లు ఉన్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద 35.7 కోట్ల రూపాయలతో రెండో స్థానంలో ఉంది. 34.85 కోట్లతో రాజస్థాన్‌ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్ (రూ.22.9 కోట్లు), ముంబై ఇండియన్స్ (రూ.15.35 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద (12.8 కోట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (రూ.10.85 కోట్లు), సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (రూ.10.75 కోట్లు) ఉన్నాయి.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌- మే నెలల్లో ఐపీఎల్‌ నిర్వహించాలని భావిస్తున్న బీసీసీఐ తేదీలతో పాటు ఎక్కడ నిర్వహించాలనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories