IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్...

IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్...
x
Highlights

IPL 2020: చెన్నై టీంలో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి దుబాయ్‌లో చేసిన కరోనా టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. తాజాగా చేసిన టెస్టుల్లో వారందరికి నెగటివ్ వచ్చింది.

IPL 2020: చెన్నై టీంలో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి దుబాయ్‌లో చేసిన కరోనా టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. తాజాగా చేసిన టెస్టుల్లో వారందరికి నెగటివ్ వచ్చింది. సెప్టెంబర్ 3న మళ్లి జరిగే కరోనా టెస్టుల్లో వాళ్లకు నెగటివ్ వస్తే.. సెప్టెంబర్ 5 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రాక్టిస్ మొదలు పెట్టనుంది. కాగా ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్న అన్ని ఐపీఎల్ జట్లల, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తప్ప మిగతా జట్లు అన్ని ప్రక్టిస్ చేస్తున్నాయి. ఇటీవలే సురేశ్ రైనా యూఏఈ నుంచి అర్థాంతరంగా వచ్చేయడంతో అతడి స్థానం ఎవరితో భర్తీ చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. చెన్నై జట్టులో ధోనీ, బ్రావో తర్వాత రైనా కీలక ఆటగాడు అన్న సంగతి తెలిసిందే.

దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి అన్న విషయం తెలిసినే.. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ లు జరగనున్నాయి.. కరోనా నేపద్యంలో జరుగుతున్న సీజన్ కావడంతో ఆటగాళ్ళను నెల రోజుల ముందే అక్కడికి చేర్చాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే దుబాయ్‌ చేరుకున్న అన్ని జట్లు ప్రాక్టిస్ మొదలుపెట్టాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories