సంచలనం కోసమే ఆమె పేరు తెరపైకి : విరాట్ కోహ్లీ

సంచలనం కోసమే ఆమె పేరు తెరపైకి : విరాట్ కోహ్లీ
x
విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ
Highlights

ఈ సంవత్సరం జులైలో ‎జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సెలక్టర్లు కోహ్లీ భార్య బాలీవుడ్ నటీ అనుష్కశర్మకు టీలు అందించారని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూక్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం జులైలో ‎జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా సెలక్టర్లు కోహ్లీ భార్య బాలీవుడ్ నటీ అనుష్కశర్మకు టీలు అందించారని టీమిండియా మాజీ క్రికెటర్ ఫరూక్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ప్రపంచ కప్‌లో అనుష్కశర్మ సెలక్టర్ల గ్యాలరీలో కూర్చోలేదు, ఫ్యామిలీ బాక్స్ లో ఉంది. అలాంటి సెలక్టర్లు ఆమెకు టీ ఎప్పుడు ఇచ్చారని నిలదీశారు. కేవలం సంచలనం కోసమే ఫరూక్ ఇంజినీర్ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ఫరూర్ సెలక్టర్లపై కోపం ఉంటే వారిపై చూపించాలి కానీ, నా భార్య పేరును మధ్యలోకి ఎందుకు లాగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుష్క, నేను ఇలాంటి విషయాలు పట్టించుకోమని కోహ్లీ స్పష్టం చేశారు. భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌కి అనుష్కశర్మ ఇద్దరి స్నేహితులతో కలిసి వచ్చింది. ఫ్యామిలీ బాక్స్‌లోనే కూర్చుందని కోహ్లీ తెలిపారు. ఫరూక్ వ్యాఖ్యలను గతంలో అనుష్కశర్మ కూడా ఖండించారు. టీమిండియా సెలక్టర్ ఎవరూ తనకు టీ ఇవ్వలేదని అనుష్క వివరణ ఇచ్చింది.

బంగ్లాదేశ్ పై చారిత్రక డే/నైట్ టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం సాదించిన సంగతి తెలిసిందే . ఈమ్యాచ్ ను కేవలం మూడు రోజులకే ముగించారు. సొంత గడ్డపై వరుస సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. కాగా.. డిసెంబర్ ఆరు నుంచి విండీస్ తో జరిగే మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఆడనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories