Ind Vs WI 3rd T20 : విండీస్ ముందు భారీ లక్ష్యం..

Ind Vs WI 3rd T20 :  విండీస్ ముందు భారీ లక్ష్యం..
x
India Vs West Indies
Highlights

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణిత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240...

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఆఖరి టీ20 మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణిత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్(91, 56బంతుల్లో, 9ఫోర్లు, 4 సిక్సులు)తో సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. కోహ్లీ(70,29 బంతుల్లో, 4 ఫోర్లు ,7 సిక్సుల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు‎ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. సొంత గడ్డపై రోహిత్ శర్మ(71, 34 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సులు)తో చెలరేగిపోయాడు. ఇద్దరు ఓపెనర్లు బౌండరీలు, సిక్సర్లుతో విండీస్‌ బౌలర్లపై విరుచుపడ్డారు. తొలి వికెట్‌కు 135పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన ఓపెనర్ల జోడిని కేస్రిక్ వీడతీశాడు. కోహ్లీ, రాహుల్ మూడో వికెట్ కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, పొలార్డ్‌, కేస్రిక్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు.

రెండో టీ20లో శివమ్ దూబే మూడో బ్యాట్స్ మెన్ గా వస్తే ఈ సారి రిషబ్ పంత్ వచ్చాడు. అయితే రెండు బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ ఖాతా తెరవకుండానే ఔటైయ్యాడు. ఇటీవలే రిషబ్ పంత్‌ను తొలిగించి సంజూ శంస్సన్ కు అవకాశం ఇవ్వాలని కొందరూ సినీయర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్ కోహ్లీ మద్దతు ఉండడంతో తుది జట్టులో కొనసాగుతన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా రిషబ్ నిరాశపరిచాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories