Ind Vs WI 3rd T20 : విండీస్‌పై భారత్ విజయ ఢంకా.. సిరీస్ కైవసం

Ind Vs WI 3rd T20 :   విండీస్‌పై భారత్ విజయ ఢంకా.. సిరీస్ కైవసం
x
Highlights

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఫైనల్ పోరులో ఇన్నింగ్స్ 67 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం...

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఫైనల్ పోరులో ఇన్నింగ్స్ 67 పరుగల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మూడో టీ20లో భారత్ విండీస్ ముందు 241పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య ఛేదనలో నిర్ణిత 20 ఓవర్లలో విండీస్ 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులకే పరిమితమైంది. టీమిండియా ప్లేయర్లు సమిష్టిగా రాణించడంతో ఆఖరు మ్యాచ్ లో విండీస్ చతికిల పడింది. 241పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. భారత ఫేస్ బౌలర్లు విజృభించడంతో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో టీ20లో టీమిండియా బౌలర్లపై విరుచుపడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన లెండిల్‌ సిమన్స్ (7) పరుగులకే షమీ శ్రేయస్స్ అయ్యార్‌కు క్యాచ్ ఔట్‌గా వెనుదిగిగాడు. మరో ఓపెనర్ కింగ్(5) పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో రాహుల్ క్యాచ్ చేతికి దొరికిపోయాడు.

శివమ్ దూబే స్టన్నింగ్ క్యాచ్‌తో నికోలస్‌ పూరన్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. హెట్‌మైర్ (41,24బంతుల్లో, 1 ఫోర్లు,5 సిక్సులు) సహకారంతో రాణించాడు. కెప్టెన్ పొలార్డ్ (68,39బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ క్యూ కట్టడంతో టీమిండియా విజయం ఖాయమైంది. ‎భారత బౌలర్లలో కుల్ దీప్, చాహర్, షమీ, భూవనేశ్వర్ కుమార్ తలా రెండు వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. బ్యాటింగ్ ప్రారంభించన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు‎ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ రాహుల్(91, 56బంతుల్లో, 9ఫోర్లు, 4 సిక్సులు)తో సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. సొంత గడ్డపై రోహిత్ శర్మ(71, 34 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సులు)తో చెలరేగిపోయాడు. ఇద్దరు ఓపెనర్లు బౌండరీలు, సిక్సర్లుతో విండీస్‌ బౌలర్లపై విరుచుపడ్డారు. తొలి వికెట్‌కు 135పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన ఓపెనర్ల జోడిని కేస్రిక్ వీడతీశాడు. తర్వాత వచ్చిన పంత్ డకౌట్ కాగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ కోహ్లీ రాహుల్ కు జతకలిశాడు. దీంతో భారత్ స్కోరు పరుగులు పెట్టింది. కోహ్లీ (70,29 బంతుల్లో, 4 ఫోర్లు ,7 సిక్సుల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ, రాహుల్ మూడో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, పొలార్డ్‌, కేస్రిక్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు.

రెండో టీ20లో శివమ్ దూబే మూడో బ్యాట్స్ మెన్ గా వస్తే ఈ సారి రిషబ్ పంత్ వచ్చాడు. అయితే రెండు బంతులు ఎదుర్కొన్న రిషబ్ పంత్ ఖాతా తెరవకుండానే ఔటైయ్యాడు. ఇటీవలే రిషబ్ పంత్‌ను తొలిగించి సంజూ శంస్సన్ కు అవకాశం ఇవ్వాలని కొందరూ సినీయర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. రిషబ్ పంత్ కోహ్లీ మద్దతు ఉండడంతో తుది జట్టులో కొనసాగుతన్నాడు. ఈ మ్యాచ్ లో కూడా రిషబ్ నిరాశపరిచాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories