Ind vs WI 2nd ODI : విశాఖలో రో'హిట్'.. భారత్ ఘన విజయం

Ind vs WI 2nd ODI :  విశాఖలో రోహిట్.. భారత్ ఘన విజయం
x
india vs west indies
Highlights

విశాఖ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డేలో భారత్ జట్టు 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

విశాఖ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డేలో భారత్ జట్టు 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 388 పరుగుల భారీ లక్ష్యంలో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 43.3 ఓవర్లలో 280 పరుగులకే కుప్పకూలీపోయింది. విండీస్ ఓపెనర్లు ఇద్దరూ శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్ కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ హోప్ (78పరుగులు, 85 బంతుల్లో 7ఫోర్లు,3సిక్సులు ) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్ లో రెండు జట్లు చెరో మ్యాచ్ విజయం సాధించి 1-1తో సమానంగా ఉన్నాయి. ఇక సిరీస్ లో చివరి మ్యాచ్ ఆదివారం ఒడిశాలోని కటక్ వేదికగా జరగనుంది.

విండీస్ మరో ఓపెనర్ లూయిస్( 30పరుగులు, 35 బంతుల్లో, 5ఫోర్లు) చేసిన ఠాకుర్ బౌలింగ్ లో అయ్యార్ కు క్యాచ్ ఇచ్చి అవుటైయ్యాడు. ఈ నేపథ్యంలో వెంస్టిండీస్ 86 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. మరో గత మ్యాచ్ లో భారత బౌలర్లపై విరుచుపడ్డ హెట్‌మైర్ (4)లాంగ్ ఆన్ దిశగా షాట్ ఆడాడు. బౌండరీకి వద్దకు బాల్ వెళ్లకుండా అద్భుతంగా ఫిల్డింగ్ చేసిన అయ్యర్.. బాల్‌ను బౌలర్ జడేజాకు అందించాడు. జడేజా బంతితో వికెట్లు గిరాటేశాడు. దీంతో హెట్‌మైర్ రనౌట్ గా వెనుదిరిగాడు.

నికోలస్‌ పూరన్ ( 75 పరుగులు 45 బంతుల్లో 6 ఫోర్లు,6 సిక్సులు) రావడంతోనే భారత బౌలర్లపై సిక్సర్లు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ విండీస్ వైపు మొగ్గినట్లు కనిపించింది. దీంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని షమీ వీడతీశాడు. నికోలస్‌ పూరన్‌ను చక్కటి అవుట్ కట్టర్‌తో షమీ బోల్తా కొట్టించాడు. కుల్ దీప్ యాదవ్‌కు చేతికి దొరికిపోయాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ పొలార్డ్ కూడా షమీ బౌలింగ్‌లోనే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. హోప్‌ను కుల్ దీప్ పెవిలియ్ బాట దారి పట్టించడంతో భారత్ విజయం లాంఛనమైంది. ఆ తర్వాత వచ్చిన వారంతా త్వరగా పెవిలియన్ చేరారు. విండీస్ జట్టు స్కోరు 210 వద్ద ఉండగా 33వ ఓవర్ బౌలింగ్ చేసిన కుల్‌దీప్ హాట్రిక్ వికెట్లు తీశాడు. హోల్డర్, పాల్, వికెట్లును కుల్ దీప్ పడగొట్టారు. భారత బౌలర్లలో కుల్ దీప్, షమీ తలా మూడు వికెట్లు పడగొట్టారు. జాడేజా రెండు వికెట్లు తీయగా, ఠాకూర్ ఓ వికెట్ దక్కించుకన్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ . ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో 50 ఓవర్లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ (102పరుగులు, 104 బంతుల్లో, 8 ఫోర్లు, 3 సిక్సులు) సాయంతో సెంచరీ చేశాడు. మరో ఓపెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ( 159పరుగులు,138 బంతుల్లో 17ఫోర్లు, 5సిక్సు)తో ఇరువురు కలిసి తొలి వికెట్‌కు 227 పరుగుల కీలక భాగస్వామ్యం అందించారు.

అయితే వీరి జోడిని విండీస్ సారథి పొలార్డ్ విడతీశాడు. రాహుల్ 102 పరుగుల వద్ద ఉండగా పొలార్డ్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించాడు. దీంతో చేజ్ కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మొదటి పవర్ ప్లేలో 55 పరుగులు మాత్రమే రాబట్టిన ఈ జోడీ రెండో పవర్ ప్లేలో భారీ స్కోరు సాధించింది. రెండో పవర్ ప్లేలో 172 పరుగులు పిండుకున్నారు. రాహుల్ , రోహిత్ ఒకరి తర్వాత పోటీ పడి ఒకరు పరుగులు వరద పారించారు.

రాహుల్ ఔట్ అయ్యినా అనంతరం బరిలోకి వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. కోహ్లీ పరుగులేమి చేయకుండానే పొలార్డ్ బౌలింగ్ లో చేజ్ క్యాచ్ అవుట్‌గా దొరికిపోయాడు. సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ విండీస్ బౌలర్లను చీల్చిచండాడు. జట్టు స్కోరు 292 పరుగుల వద్ద రోహిత్ కాట్ర‌ల్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట‌య్యాడు. శ్రేయస్స్ అయ్యార్ కేవలం 28 బంతుల్లోనే తన కెరీర్ లో ఫాస్టెట్ అర్ధసెంచరీ నమోదు చేశాడు. మొత్తం ( 53పరుగులు, 3 2బంతుల్లో 3 ఫోర్ల, నాలుగు సిక్సులు).

మొదటి వన్డేలో రాణించిన పంత్ రెండో వన్డేలో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 16 బంతులు ఎదుర్కొన్న పంత్(39) 4 సిక్సులు, 3పోర్లుతో విండీస్ బౌలర్లను ఉతికారేశాడు. కాగా, చివరి ఓవర్లలో స్కోరు సాధించే క్రమంలో పంత్, శ్రేయస్స్ అయ్యార్ ఔటయ్యారు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ పొలార్డ్ 2 వికెట్లు తీసుకోగా, కాట్రెల్, పాల్, జోస్ఫ్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories