IND V NZ 2nd T20I : జైత్రయాత్రను కొనసాగించిన భారత్

IND V NZ 2nd T20I : జైత్రయాత్రను కొనసాగించిన భారత్
x
న్యూజిలాండ్ Vs భారత్
Highlights

న్యూజిలాండ్ పై జరగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది.

న్యూజిలాండ్ పై జరగుతున్న ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్ నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యం ఏడు వికెట్ల తేడాతో అలవొకగా ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయి 15 బంతులు మిగిలి ఉండగానే 135 చేసి భారత్ విజయంపరంపర కొనసాగించింది. టీమిండియా ఓపెనర్ రాహుల్(57 పరుగులు, 50 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు) అజేయ అర్ధసెంచరీతో సత్తాచాటాడు. శ్రేయస్స్ అయ్యర్ (44పరుగులు, 33 బంతుల్లో 1ఫోరు, 3 సిక్సులు) రాణించాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక మూడో టీ20 మ్యాచ్ ఈనెల 29న జరగనుంది.

133 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా హిట్ మ్యాన్ ఓపెనర్ రోహిత్ శర్మ(8) రెండు ఫోర్లుతో ఊపుమీదనున్నట్లు కనిపించనప్పటికి టీమ్ సౌథీ బౌలింగ్ లో షాట్ కు యత్నించి టేలర్ చేతికి చిక్కాడు. దీంతో జట్టు స్కోరు 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (11) పరుగులు సౌథీ బౌలింగ్ ఔటైయ్యాడు. ఓపెనర్ రాహుల్ శ్రేయస్స్ అయ్యరు జతకలవడంతో ఇద్దరు కలిసి కివీస్ బౌలర్లపై చెలరేగిపోయాడు. వీద్దరు కలిసి మూడో వికెట్ కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

టెక్నిర్ వేసిన ఇన్నింగ్స్16 ఓవర్ లో శ్రేయస్ ఫోరు సిక్సుతో చెలరేగిపోయాడు. ఆ ఓవర్లో ఏకంగా 14 పరుగులు రాబట్టాడు. దీంతో భారత్ విజయనికి చేరువగా వచ్చింది. భారీ షాట్ ఆడే క్రమంలో శ్రేయస్ ఐస్ సౌథీ బౌలింగ్ లో ఔటైయ్యాడు. అనంతరం క్రిజులోకి వచ్చిన శివమ్ దూబే లాంఛనాన్ని ముగించాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. సౌథి ఒక వికెట్ పడగొట్టాడు.



అంతకుముందు టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ నేర్పిన గుణపాఠంతో ఈ మ్యాచ్‌లో బౌలర్లు సక్సెస్ అయ్యారు. న్యూజిలాండ్‌కు ఆరంభం పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత కివీస్ ని ఏ దశలో కూడా కోలుకోనివ్వకుడా కట్టుదిట్టం చేశారు. దీనితో కివీస్ నిర్ణిత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. పవర్ ప్లే ఆఖరి ఓవర్లో శార్దూల్ బౌలింగ్‌లో భారీ షాటే ఆడేందుకు గప్టిల్ ప్రయత్నించి కోహ్లికి చిక్కాడు. దీనితో 48 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత దూబే బౌలింగ్‌లో మున్రో కూడా కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 68 పరుగులకే కివీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన గ్రాండ్ హోమ్ (3), విలియమ్సన్ 14 (20) కూడా తక్కువ పరుగులకే వెనుదిరిగారు. దీనితో కివీస్ 12 ఓవర్లకే 81 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ తరుణంలో సిఫెర్ట్ 33(26), రాస్ టైలర్ 18(24) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు కలిసి 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనితో న్యూజిలాండ్ 132 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అయిన చేయగలిగింది. దీనితో భారత లక్ష్యం 133 గా ఉంది. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నెగ్గిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories