Ind Vs Eng Test: పరుగుల వరద పారించిన ఇంగ్లండ్.. ఇంగ్లండ్ 423/8

India Vs England Third Test Match England Team Scores 423 Runs Loss of 8 Wickets And Captain Joe Root Gets Century
x

121 రన్స్‌తో చెలరేగిన కెప్టెన్‌ జో రూట్‌ (ట్విట్టర్ ఫోటో)

Highlights

* 121 రన్స్‌తో చెలరేగిన కెప్టెన్‌ జో రూట్‌ * 345 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్‌

India Vs England Test: టీమిండియా విఫలమైన పిచ్‌పై ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. ఫుల్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ జో రూట్‌ 121 పరుగులతో చెలరేగిపోయాడు. మొదటి రెండు టెస్టుల్లో తడబడిన ఇంగ్లండ్‌ మూడో టెస్ట్‌లో పుంజుకుంది. పసలేని భారత బౌలింగ్‌ను చెడుగుడు ఆడుకుంది. రూట్‌ సిరీస్‌లో వరుసగా మూడో సెంచరీలు బాదాడు.

మూడేళ్ల తర్వాత టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన డేవిడ్‌ మలన్‌కూడా 70 పరుగులతో రాణించాడు. అయితే, ఆఖరి సెషన్‌లో పుంజుకున్న టీమిండియా బౌలర్లు రూట్‌తోపాటు 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ఆధిక్యాన్ని కొంతమేర అడ్డుకోగలిగారు. ఆటముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 423 పరుగులు చేసింది. ఇప్పటికి ఇంగ్లండ్‌ 345 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories