India vs Bangladesh 3rd T20 : దీపక్ చాహర్ ప్రపంచ రికార్డు... 2-1తో భారత్ సిరీస్ కైవసం

India vs Bangladesh 3rd T20 : దీపక్ చాహర్ ప్రపంచ రికార్డు...  2-1తో   భారత్ సిరీస్ కైవసం
x
Highlights

నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే ...

నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌లో జరిగిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. లక్ష్య చేధనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో 30 పరుగుల తేడాతో భారత్ విజయం విజయం సాధించింది.దీపక్ సహార్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 3.2 ఓవర్లు వేసిన దీపక్ సహర్ 7 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కు దీపక్ చాహర్ ఎంపికయ్యాడు.


మూడు టీ20ల సిరీస్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. 175 పరుగుల విజయలక్ష్యంలో బరిలోకి దిగిన బంగ్లా 12 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ లిప్టన్ దాస్(9) వికెట్ కోల్పోయింది. సౌమ్య సర్కార్ పరుగులేమి చేయకుండా అవుటైయ్యాడు. దీంతో బంగ్లా కష్టాల్లో పడింది. ఓపెనర్ నయిమ్ హాఫ్ సెంచరీ చేశాడు. నయిమ్ మరో ఆటగాడు మిథున్ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 98పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

ప్రమాదకరంగా మారుతున్న వీరి భాగస్వామ్యానికి చాహర్ తెరదించాడు. మిథున్(27) ఔట్ చేశాడు. 12.6 ఓవర్లలో బంగ్లా 110/3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన రహీమ్ శివమ్ దూబే బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. 13.1 ఓవర్లో 110/4 వికెట్లు కోల్పోయింది. ఒంటరిగా పోరాడిన మహ్మద్ నయిమ్ 48 బంతుల్లో 81పరుగులు సాధించాడు. కీలక ఆటగాళ్లలంతా చేతులెత్తేయడంతో బంగ్లా ఓటమిపాలైంది. భారత్ బౌలర్ చాహార్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. భారత బౌలర్లలో దీపక్ 3.2 ఓవర్లలో చాహార్ 7 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు.. పొట్టి ఫార్మాట్ లో తక్కవ పరుగులు ఇచ్చి వరసగా హ్యట్రిక్ వికెట్లు తీశాడు. అమినుల్ ఇస్లామ్, షఫియుల్ ఇస్లామ్, ముస్తాఫిజర్ రెహ్మాన్ వికెట్లు తీసి ‍హ్యట్రిక్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. శివమ్ దూబే 3, చాహల్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఇండోర్ వేధికగా ఈనెల 14న భారత్ బంగ్లా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.

అంతకుముందు భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచిన బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించన టీమిండియా ఆదిలో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకుంది. ఆరు బంతులు ఎదుర్కొన్న రోహిత్ రెండు పరుగుల చేసి జట్టు వ్యక్తి గత స్కోరు 3 పరుగుల వద్ద సైపుల్ ఇస్లామ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రెండు టీ20లల్లో రాణించిన మరో ఓపెనర్ శిఖర్(19 4X4) ధావన్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. సైపుల్ ఇస్లామ్ వేసిన బంతిని ఎదర్కొనే క్రమంలో మహ్మదుల్లాకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు.

35/2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్ లోకేశ్ రాహుల్, శ్రేయస్స్ ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ధాటిగా ఆడుతున్న లోకేశ్ రాహుల్ 35 బంతుల్లో ఏడు ఫోర్లతో 52 పురుగులు చేసి అల్ అమిన్ బౌలింగ్ లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. శ్రేయస్స్ అయ్యార్(62, 33 బంతుల్లో 3x4, 5x6) సౌమ్య సర్కార్ బౌలింగ్ లో లిప్టన్ దాస్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో సైపుల్ ఇస్లామ్, సౌమ్య సర్కార్ చెరి 2 వికెట్లు తీసుకున్నారు. హుస్సెన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. మూడు టీ20ల సిరీస్ భారత్ కైవసం చేసుకంది. ఇండోర్ వేధికగా ఈనెల 14న భారత్ బంగ్లా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories