U19 Women's T20 World Cup 2025: సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ ఓటమి.. ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించిన భారత జట్టు..!

2025 అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్‌ను ఓడించింది.

CR Reddy
Updated on: 6 May 2025 3:38 PM IST
India Storms into U-19 Women
X

U19 Women's T20 World Cup 2025: సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ ఓటమి.. ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించిన భారత జట్టు..!

U-19 Women's T20 World Cup Semi-Final: 2025 అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత అండర్ 19 జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీం ఇండియా తరఫున జి కమలినీ అద్భుతంగా రాణించి అజేయంగా నిలిచి హాఫ్ సెంచరీ సాధించింది. తను 50 బంతుల్లో 56 పరుగులు చేశారు. కమలినీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి.

మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ సమయంలో ఓపెనర్ డేవినా పెర్రిన్ 45 పరుగులు సాధించింది. ఆమె 40 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. ట్రాయ్ జాన్సన్ 25 బంతులు ఆడి 30 పరుగులు చేసింది. తను 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. ఈ సమయంలో ఆయుషి శుక్లా భారతదేశం తరపున 2 వికెట్లు పడగొట్టారు. తను 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చింది. పారుణిక, వైష్ణవి శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించిన టీం ఇండియా కేవలం 15 ఓవర్లలోనే మ్యాచ్‌ను గెలిచింది. భారతదేశం తరపున జి కమలినీ, జి త్రిష ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. త్రిష 29 బంతులను ఎదుర్కొని 35 పరుగులు చేసింది. తను 5 ఫోర్లు కొట్టింది. కాగా కమలినీ అర్ధ సెంచరీ సాధించింది. తను 50 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచారు. కమలినీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి. సానికా చల్కే 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. తను ఒక్క ఫోర్ మాత్రమే కొట్టారు.

2025 అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీం ఇండియా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. వెస్టిండీస్, మలేషియా, శ్రీలంక, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌లను భారత్ ఓడించింది. సెమీఫైనల్లో టీం ఇండియా ఇంగ్లాండ్‌ను ఓడించింది. దీంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించింది.

CR Reddy

CR Reddy

Next Story