
India vs Pakistan: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్లు రద్దు.. క్రికెట్ ప్రపంచంలో టెన్షన్!
India vs Pakistan: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ నుండి ఇండియా ఛాంపియన్స్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంటూ అధికారికంగా వైదొలిగింది.
India vs Pakistan: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ నుండి ఇండియా ఛాంపియన్స్ జట్టు సంచలన నిర్ణయం తీసుకుంటూ అధికారికంగా వైదొలిగింది. సెమీ-ఫైనల్లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడాల్సి ఉండగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీని కారణంగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్తో మ్యాచ్లలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నారు. ఈ వివాదం అక్కడితో ఆగలేదు. భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు రాబోయే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల భవిష్యత్తుపై కూడా అనుమానాలకు దారితీస్తున్నాయి.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లో ఇండియా ఛాంపియన్స్ జట్టు తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సెమీ-ఫైనల్లో పాకిస్తాన్ను ఎదుర్కోవాల్సి ఉండగా, భారత జట్టు టోర్నమెంట్ నుంచి వైదొలగింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత క్రికెటర్లు పాకిస్తాన్తో ఎలాంటి మ్యాచ్లలో ఆడటానికి ఆసక్తి చూపలేదు. ఈ కారణంగా డబ్ల్యూసీఎల్ 2025 లీగ్ దశలో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కూడా రద్దు అయింది. అప్పుడు రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పుడు సెమీ-ఫైనల్కు ముందు కూడా ఇదే వైఖరిని కొనసాగించడంతో, భారత జట్టు టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీనితో పాకిస్తాన్కు నేరుగా ఫైనల్లో చోటు దక్కింది.
ఈ వివాదం కేవలం డబ్ల్యూసీఎల్ 2025కే పరిమితం కాదు. రాబోయే ముఖ్యమైన అంతర్జాతీయ టోర్నమెంట్లలో కూడా భారత్-పాకిస్తాన్ మ్యాచ్లపై సందేహాలు రేకెత్తుతున్నాయి.
1. ఆసియా కప్
ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం, ఈ రెండు జట్ల మధ్య సెప్టెంబర్ 14న ఒక మెగా మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశ మ్యాచ్ తర్వాత, రెండు జట్లు సూపర్-4లో కూడా తలపడే అవకాశం ఉంది. ఒకవేళ ఇరు జట్లు ఫైనల్కు చేరుకుంటే, మూడోసారి కూడా తలపడవచ్చు. అయితే, షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచీ బీసీసీఐ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో ఈ మ్యాచ్లపై కూడా ప్రమాదపుటంచున ఉన్నాయి.
2. మహిళల వన్డే వరల్డ్ కప్ 2025
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు కూడా పాకిస్తాన్ను ఎదుర్కోవాల్సి ఉంది. భారత్, పాకిస్తాన్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 5న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. డబ్ల్యూసీఎల్ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ రద్దు ప్రభావం ఈ మ్యాచ్పైనా పడవచ్చు. మహిళల వన్డే వరల్డ్ కప్లో కూడా ఇరు జట్లు నాకౌట్ దశలకు చేరుకుంటే, ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది.
డబ్ల్యూసీఎల్ 2025లో రెండుసార్లు మ్యాచ్లు రద్దు
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో ఇండియా ఛాంపియన్స్ తమ మొదటి మ్యాచ్ను పాకిస్తాన్ జట్టుతో ఆడాల్సి ఉంది. కానీ అప్పటి భారత క్రికెటర్లు సురేష్ రైనా మరియు శిఖర్ ధావన్ వంటి ఆటగాళ్లు ఈ మ్యాచ్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. దీంతో ఆ మ్యాచ్ రద్దు చేయబడి, రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పుడు సెమీ-ఫైనల్ మ్యాచ్ కూడా ఇదే కారణంతో రద్దవడంతో, భారత జట్టు టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
ఈ పరిస్థితులు భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాజకీయ ఉద్రిక్తతలు క్రీడా సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇది మరోసారి స్పష్టం చేసింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




