Ind vs Sa 2nd test : విజృంభించిన ఉమేష్.. దక్షిణాఫ్రికా 33/3

Ind vs Sa 2nd test : విజృంభించిన ఉమేష్.. దక్షిణాఫ్రికా 33/3
x
Highlights

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ‌్రికా జట్టు 3వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. అంతకుముందు 273/3తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విరోచిత డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.

పుణె వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ‌్రికా జట్టు 3వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. అంతకుముందు 273/3తో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ విరోచిత డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 336 బంతులు ఎదుర్కొన్నవిరాట్ 254 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన టెస్టు కెరీర్‌లో కోహ్లీకి ఇది ఏడో డబుల్ సెంచరీ. విరాట్‌కు తోడుగా రహానే 59 పరుగు చేశాడు. జడేజా 91 పరుగులు చేసి ముత్తుసామీ బౌలింగ్ లో అవుటైయ్యాడు. భారత్ జట్టు భారీ స్కోరు నమోదు చేసి ఇన్నింగ్స్ 601/5 డిక్లేర్డ్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు రబడా మూడు వికెట్లు తీసుకోగా.. మహరాజ్, మత్తుసామీ చేరో వికెట్ తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు 36/3 వికెట్లు కోల్పోయింది. భారత్ బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. భారత్ బౌలర్లలో ఉమేష్ యాదవ్ రెండు వికెట్లు తీసుకోగా..షమి ఒక వికెట్ తీశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories