IND vs ENG 4th Test: నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌

IND vs ENG 4th Test
x

IND vs ENG 4th Test: నేటి నుంచి భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య కీలకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌

Highlights

IND vs ENG 4th Test: భారత్‌ vs ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కీలక మలుపు తిరిగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ నేడు (జూలై 23) మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది.

IND vs ENG 4th Test: భారత్‌ vs ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కీలక మలుపు తిరిగింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ నేడు (జూలై 23) మాంచెస్టర్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభమవుతుంది. అదే సమయంలో టాస్ ప్రక్రియ కూడా జరగనుంది.

భారత జట్టు ఇప్పటికే మూడు టెస్టుల్లో ఒకదానిని మాత్రమే గెలిచి వెనుకబడింది. ఇక నాలుగో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసేందుకు భారత్‌కు ఇది తుదిపోరు లాంటి మ్యాచ్. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాన్ని గట్టిగా పట్టుకున్నట్టే అవుతుంది.

గాయాల బెడద.. భారత జట్టులో భారీ మార్పులు

భారత జట్టులో ఈ మ్యాచ్‌కు ముందు అర్ష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీరి స్థానాల్లో కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావాల్సి వచ్చింది. తద్వారా భారత్ బలమైన మార్పులతో బరిలోకి దిగుతోంది.

జట్లు ఇలా...

భారత జట్టు:

యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (ఉప కెప్టెన్ & వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ / శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అన్షుల్ కాంబోజ్.

ఇంగ్లండ్ జట్టు:

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.

Show Full Article
Print Article
Next Story
More Stories