Piyush Chawla: ధోనీతో ఆడ‌టమే చాలా సంతోషక‌రం: పియూష్ చావ్లా

Piyush Chawla: ధోనీతో ఆడ‌టమే చాలా సంతోషక‌రం: పియూష్ చావ్లా
x

Piyush Chawla  

Highlights

Piyush Chawla: ఐపీఎల్‌ 2020 త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్ సీఎస్‌కే ముంబై ఇండియన్స్ మ‌ధ్య జ‌రుగ‌నున్న‌ది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలువగా.. ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్‌ గెలుచుకుంది

Piyush Chawla: ఐపీఎల్‌ 2020 త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్ సీఎస్‌కే ముంబై ఇండియన్స్ మ‌ధ్య జ‌రుగ‌నున్న‌ది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు ఛాంపియన్స్‌గా నిలువగా.. ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు టైటిల్‌ గెలుచుకుంది. ఈ రెండు టీంల మ‌ధ్య హోరాహోరీ పోరు జ‌రుగ‌నున్న‌ది. ఈ క్రీడా స‌మరానికి ఆటగాళ్లంతా క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నారు.

ఈ క్ర‌మంలో స్టార్ స్పిన్న‌ర్‌ పియూష్ చావ్లా చెన్నై టీంలో ఆడ‌నున్నాడు . ఈ నేప‌థ్యంలో చావ్లా మాట్లాడుతూ.. ఎనిమిదేళ్ల తరువాత ధోనీ కెప్టెన్సీలో క్రికెట్‌ ఆడటం సంతోషంగా ఉందన్నాడు. అత్యుత్తమ కెప్టెన్‌తో కలిసి ఆడటం కన్నా ఇంకేం కావాలి..? అని చావ్లా చెప్పుకొచ్చాడు.

మొదట కోల్‌కతా జట్టులో ఆడిన చావ్లాను జట్టులో బలమైన స్పిన్‌ లైనప్‌ ఉన్నప్పటికీ ధోని ఎంపిక చేసుకున్నాడు. చాలాకాలం తరువాత ధోని భాయ్‌తో కలిసి ఆడటం సంతోషంగా ఉందన్నాడు. అతడు బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. ఇంకా ప్రోత్సహిస్తాడని కితాబిచ్చాడు.

ఐపీఎల్ 2020 వేలంలో పియూష్ చావ్లాను చెన్నై రూ.6.75 కోట్లకు కొనుగోలు చేసింది. చావ్లా చివరిసారి 2012లో టీమిండియా తరపున ఆడాడు. ఆ తరువాత కేవలం దేశవాళి, ఐపీఎల్‌ టోర్నీలు మాత్రమే ఆడుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories