Rohit Sharma: షాకింగ్ న్యూస్.. అదే రోహిత్, విరాట్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్


Rohit Sharma: షాకింగ్ న్యూస్.. అదే రోహిత్, విరాట్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్
Rohit Sharma: భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రీఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Rohit Sharma: భారత క్రికెట్ అభిమానులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల రీఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు దిగ్గజాలు, ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. అయితే, వీరిద్దరి భవిష్యత్తు గురించి ఒక సంచలన వార్త బయటికొచ్చింది. ఈ ఏడాది అక్టోబర్లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనే రోహిత్, విరాట్లకు వారి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో చివరిది కావచ్చని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్పై బీసీసీఐ దృష్టి సారించింది. ఈ మెగా టోర్నమెంట్కు యువ ఆటగాళ్లతో కూడిన ఒక కొత్త జట్టును సిద్ధం చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. అందుకే, ఈ ఏడాది అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ చివరిసారిగా భారత జెర్సీలో కనిపించవచ్చని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే, ఈ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడాలనుకుంటే, వారికి ఒక షరతు విధించే అవకాశం ఉంది. 2027 వరల్డ్ కప్కు సన్నద్ధం అయ్యే యువ ఆటగాళ్లకు దారి ఇవ్వడానికి, వీరు తమ ఫామ్ను నిరూపించుకోవడం కోసం డిసెంబర్లో జరిగే దేశీయ వన్డే టోర్నమెంట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో తమ రాష్ట్ర జట్ల తరపున ఆడాల్సి ఉంటుందని సమాచారం. గతంలో బార్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఫెయిల్ అయిన తర్వాత, వీరికి రంజీ ట్రోఫీలో ఆడాలనే షరతు విధించినట్లు, అక్కడ కూడా రాణించకపోవడంతోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు న్యూజిలాండ్ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనలోనూ జట్టుకు సారథ్యం వహించే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే, ఈ సిరీస్ ప్రారంభం కాకముందే ఇది తమ చివరి అంతర్జాతీయ సిరీస్ అని రోహిత్, విరాట్ ప్రకటించే అవకాశం కూడా ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వన్డే ఫార్మాట్లో సాధించిన విజయాలు అపారమైనవి. 2007లో వన్డే అరంగేట్రం చేసిన రోహిత్, ఇప్పటివరకు 273 వన్డేలు ఆడి 48.76 సగటుతో 11,186 పరుగులు చేశాడు. ఇందులో 32 సెంచరీలు, 58 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2008లో ఈ ఫార్మాట్లో అడుగుపెట్టిన విరాట్, ఇప్పటివరకు 302 వన్డేలు ఆడి 57.88 సగటుతో 14,181 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



