Chennai Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

England won the toss and elected to Bat first in Chennai test
x

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (ఫైల్ ఫోటో)

Highlights

ఇంగ్లాండ్ తో భారత్ జట్టు చెన్నై లో ఈరోజు తోలి టెస్ట్ మ్యాచ్ లో తలపడబోతోంది.

ఇంగ్లాండ్ జట్టు భారత టూర్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు చెన్నై చేపాక్ స్టేడియం వేదిక కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పై గడ్డి బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉన్న అంచనాలతో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తొలుత బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపాడు.

ఇక టీమిండియా ఈ మ్యాచ్ కోసం పూర్తిగా సిద్ధం అయింది. జట్టులో నదీం, వాషింగ్టన్ సుందర్ లకు స్థానం కల్పించారు. అయితే, ఇటీవల ముగిసిన ఆసీస్ సిరిస్ లో అద్భుత ప్రతిభ చూపించిన మహమ్మద్ సిరాజ్ కు సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. ఇదిలా ఉండగా ఈరోజు ప్రారంభం కాబోతున్న తొలి టెస్ట్ లో ఆడబోయే ఆటగాళ్ళ తుది జాబితా ఇలా ఉంది..

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, షాహబాజ్ నదీమ్, ఇషాంత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా.

ఇంగ్లండ్ జట్టు: డామ్ సిబ్లీ, రోరీ బుర్న్స్, డాన్ లారెన్స్, జో రూట్, బెన్ స్టోక్స్, ఓలీ పోప్, జోస్ బట్లర్, డోమ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.

Show Full Article
Print Article
Next Story
More Stories