Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ టీంకు భారీ షాక్

Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ టీంకు భారీ షాక్
x

Champions Trophy 2025: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు ముందు న్యూజిలాండ్ టీంకు భారీ షాక్

Highlights

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం భారత్‌తో తలపడనుంది.

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం భారత్‌తో తలపడనుంది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించింది. కానీ ఫైనల్‌కు ముందే ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ క్రికెటర్ మాట్ హెన్రీ గాయపడినట్లు ఒక నివేదిక తెలిపింది. భారత్‌తో జరిగే ఫైనల్‌లో తను ఆడటంపై ప్రస్తుతం డౌట్లు ఉన్నాయి.

బుధవారం లాహోర్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య సెమీఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ 29వ ఓవర్లో హెన్రీ గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ క్యాచ్‌ను తీసుకునే ప్రయత్నంలో అతను లాంగ్ ఆన్ నుండి పరిగెత్తాడు. హెన్రీ క్యాచ్ పట్టాడు.. కానీ అదే సమయంలో భుజానికి గాయం అయింది. దీని కారణంగా హెన్రీ కూడా స్టేడయిం నుంచి నిష్క్రమించాడు.

భారత్‌తో జరిగే ఫైనల్‌లో హెన్రీ ఆడడా?

మాట్ హెన్రీ టీమిండియాతో ఆడతాడా లేదా అనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. సెమీ-ఫైనల్‌లో మాట్ హెన్రీ 7 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ కాలంలో తను 43 పరుగులకు 2 వికెట్లు తీశాడు. సెమీ-ఫైనల్స్ లో గ్రౌండ్ వదిలి వెళ్ళిన తర్వాత హెన్రీ కూడా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేశాడు. తన ప్రస్తుత పరిస్థితిపై అప్ డేట్ అందుబాటులో లేదు.

ఛాంపియన్ ట్రోఫీ టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ తన మొదటి గ్రూప్ మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో ఆడింది. పాకిస్తాన్‌ను 60 పరుగుల తేడాతో ఓడించాడు. న్యూజిలాండ్ బంగ్లాదేశ్‌తో రెండవ మ్యాచ్ ఆడింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది. కానీ ఆ జట్టు భారత్ చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. భారత్ న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇప్పుడు అది ఫైనల్ మ్యాచ్ భారత్ తో ఆడేందుకు రెడీగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories