Australia vs India 3rd Test: నిలకడగా ఆడుతున్న భారత్.. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్

Australia vs India 3rd Test: నిలకడగా ఆడుతున్న భారత్.. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్
x
Highlights

సీడ్నీ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి రోజు ఉత్కఠంగా మారింది.

సీడ్నీ వేదికగా ఆస్ట్రేలియా భారత్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఆఖరి రోజు ఉత్కఠంగా మారింది. రెండో ఇన్నింగ్స్ మూడో సెషన్ ఆడుతున్న టీమిండియా 100.3 ఓవర్లలోనాలుగు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. కీలక సమయంలో రిషభ్‌పంత్‌(97; 118 బంతుల్లో 12x4, 3x6), పుజారా(77; 205 బంతుల్లో 12x4) ఔటవ్వడంతో ఫలితంపై ఆసక్తి పెరిగింది.

లంచ్ బ్రేక్ తర్వాత దూకుడుగా ఆడుతున్న పంత్‌ లైయన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి కమిన్స్‌ చేతికి చిక్కాడు. దీంతో అతడు తృటిలో శతకం చేజార్చుకున్నాడు. తర్వాత విహారి(4; 58 బంతుల్లో) క్రీజులోకి రావడంతో స్కోర్‌ బోర్డు నెమ్మదించింది. అతడు పూర్తిగా డిఫెన్స్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే పాట్ కమిన్స్‌ వేసిన 83వ ఓవర్‌లో పుజారా హ్యాట్రిక్‌ ఫోర్లు బాదాడు. కాసేపటికే హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో అతడు ఔటవ్వడంతో భారత్‌ 272 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆపై క్రీజులోకి వచ్చిన అశ్విన్‌(15; 49 బంతుల్లో 2x4)తో కలిసి విహారి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆసీస్ బౌలర్లలో లైయన్ రెండు కీలక వికెట్లు దక్కించుకున్నాడు.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 98/2తో ఐదో రోజు ఆట కొనసాగించిన భారత్ ఆదిలోనే కెప్టెన్ రహానే (4) ఔటయ్యాడు. లైయన్ బౌలింగ్ లో వైడ్ చేతికి దొరికిపోయాడు. భారత్ 102 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ క్రమంలో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లు ధాటిగా ఎదుర్కొన్నాడు. పుజారా, పంత్ నాలుగో వికెట్ కు 148పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ ఔటైన తర్వాత టీమిండియా స్కోరు నెమ్మదించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories