గుడ్ ‌బై... అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్

గుడ్ ‌బై... అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్
x
Virat Kohli and Anuska Sharma File Photo
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ఆటతోనూ.. బాలీవుడ్ నటి, అతని సతీమణి అనుష్క శర్మ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ ఆటతోనూ.. బాలీవుడ్ నటి, అతని సతీమణి అనుష్క శర్మ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. ఖాళీ దొరికిన కొంచెం సమయాన్ని ఇద్దరూ కలిసి సంతోషంగా గడుపుతారు. ఖాళీ సమయంలో కోహ్లీ, అనుష్క శర్మ ఇద్దరూ టూర్‌లకు వెళ్తుంటారు. దానికి సంబందించిన ఫొటోనో, వీడియోనో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారురు.

ప్రస్తుతం కివీస్ తో దైపాక్షిక సిరీస్‌లో భాగంగా.. న్యూజిలాండ్‌ పర్యటనలో విరాట్‌ కోహ్లీ ఉన్నారు. కాగా.. వన్డే సిరీస్‌ ముగిసిన తర్వా అనుష్క శర్మతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. పుటుటురులోని బ్రూస్ప్రింగ్స్‌ను వెళ్లారు. వీరితో పాటు సీనియర్ బౌలర్ల మహ్మద్‌ షమీ, నవ్‌దీప్‌ సైనీలు వారుతో కలిసి వెళ్లారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అనుష్క తన భర్తను విడిచి భారత్‌కు పయనమైనట్లు సమాచారం. భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ప్రారంభమవుతుంది. దీంతో అనుష్క స్వదేశానికి పయనమైయ్యారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా అనుష్క, కోహ్లీను విడిచి భారత్‌కు వస్తున్న సమయంలో.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టింది. 'వీడ్కోలు చెప్పడం సమయంతో పాటు తేలికవుతుందని భావిస్తుండొచ్చు. కానీ.. అది ఎప్పటికీ జరగదు' అని విరాట్ కోహ్లీతో దిగిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ అనుష్క అభిమానులతో పంచుకున్నారు. కోహ్లీకి కొన్ని రోజుల పాటు దూరంగా ఉండాల్సి రావడంతో అనుష్క ఇలా భావోద్వేగం చెందింది. మరోవైపు వాలెంటైన్స్‌ డే రోజు అనుష్కతో దిగిన ఫొటోను కోహ్లీ ట్విటర్‌లో పోస్టు చేశాడు.

ఇటీవల అనుష్క శర్మ 'జీరో' సినిమాలో నటించింది. షారూఖ్ ఖాన్, కత్రినా కైఫ్ లాంటి స్టార్లతో ఆమె నటించారు. తాజాగా అనుష్క టీమిండియా మహిళ క్రికెటర్, బౌలర్ జులన్ గోస్వామి జీవిత చరిత్రను బయోపిక్‌గా తెరకెక్కబోతున్న 'చక్దాహా ఎక్స్‌ప్రెస్' అనే చిత్రంలో నటింటిస్తున్నారు. కాగా..క్రికెటర్ పాత్ర కావడంతో దీనికోసం అనుష్క శర్మ క్రికెట్‌లో శిక్షణ తీసుకుటున్న విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories