తిరుమల సమాచారం: సాధారణంగా భక్తుల రద్దీ

తిరుమల సమాచారం: సాధారణంగా భక్తుల రద్దీ
x
Highlights

♦ శుక్రవారం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామి మూలమూర్తికి పురాభిషేకం ♦ గురువారం 70, 661 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

పుణ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ శుక్రవారం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామి మూలమూర్తికి పురాభిషేకం (శుక్రవారాభిషేకం) నిర్వహించి...నూతన పట్టువస్త్రాన్ని, ఉత్తరీయాన్ని.....వజ్రవైడుర్యాలు, మరకత-మాణిక్యాలు పొదిగిన సువర్ణాభరణాలతో స్వామివారిని అర్చకులు అలంకరించారు.

ఇక సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునే భక్తులకు 10 గంటల సమయం, ప్రత్యేకప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకునే భక్తులకు 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం, ఆధార్ కార్డు నమోదు తో కేటాయించే టైంస్లాట్ సర్వదర్శనం టోకన్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతొంది.

నిన్నటి రోజు గురువారం 70, 661 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, వీరు సమర్పించిన కానుకలతో రూ 3.05 కోట్లు హుండీ ఆదాయం శ్రీవారికి వచ్చింది, 30,551 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories