తిరుమల సమాచారం

తిరుమల సమాచారం
x
Highlights

ఈ రోజు మంగళవారం, 09.07.2019 ఉదయం 5 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 12 గదుల్లో భక్తులు వేచియున్నారు....

ఈ రోజు మంగళవారం, 09.07.2019 ఉదయం 5 గంటల సమయానికి స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 12 గదుల్లో భక్తులు వేచియున్నారు. సర్వదర్శనానికి సుమారు 12 గంటలు పడుతుంది. శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ రు.300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న (సోమవారం) 85,649 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం దొరికింది. నిన్న(సోమవారం)30,499 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రు.3.30 కోట్లు. వయోవృద్దులు,దివ్యాంగుల కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ ద్వారా ఉ: 10 గంటలకి (750) మ: 2 గంటలకి (750) దర్శనానికి కూపన్లు జారీ చేస్తారు. చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై లకు సుపథం మార్గం ద్వారా ఉ: 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories