తిరుమలలో కొనసాగుతున్న రద్దీ!

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ!
x
Highlights

సెలవులు ముగియనుండడం తో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోప తండాలుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా తిరుమల భక్తజనసంద్రంగా...

సెలవులు ముగియనుండడం తో తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోప తండాలుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా తిరుమల భక్తజనసంద్రంగా మారింది. ఈ రోజు ఉదయం 5 గంటల సమయానికి తిరుమల శ్రీవారి క్యూ లైన్లు నిండిపోయాయి. కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి.. బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామీ వారిని 68,779 మంది దర్శించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ద్వారా ఆదాయం 3.15 కోట్లు వచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories