పంచారామాల గురించి తెలుసుకుందాం రండి!!

పంచారామాల గురించి తెలుసుకుందాం రండి!!
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాల గురించి స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం వివరించారు. పూర్వం...

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాల గురించి స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం వివరించారు. పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగం సంపాదిస్తాడు. దీంతో వర గర్వముతో దేవతలను హింసలు గురిచేయగా, దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధిస్తారు. శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు. యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని కంఠంలోని ఆత్మలింగంను చేధిస్తేనే మరణం కలుగుతుందని గ్రహించి ఆ లింగమును చేధించడంతో తారకాసురుడు మరణిస్తాడు. అలా చేధనకు గురైన ఆత్మలింగం... ఐదు ప్రాంతాల్లో పడుతుంది. ఆ తరువాత వాటిని ఆయా ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠిస్తారు. అవే పంచారామాలు.

1.దాక్షారామం

పంచరామాల్లో మొదటిదైన దాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని భీమేశ్వరుడు అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పైఅంతస్తు నుంచి పూజలు నిర్వహించాలి. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు సగభాగం నలుపుతో ఉంటుంది.

2.అమరారామం

పంచారామల్లో రెండవదైన అమరారామం గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణా తీరంలో ఉంది. ఇక్కడ స్వామిని అమరేశ్వరుడు అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించారు.

3.క్షీరారామం

క్షీరారామము పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉంది. ఇక్కడ శివుని మూర్తిని శ్రీ క్షీరారామ లింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామి వారిని త్రేతాయుగ కాలంలో సీతారాములు ఇద్దరూ ప్రతిష్ఠించారట. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలుతో కట్టారు.

4.సోమారామం

పంచరామాల్లో నాల్గవదైన సోమారామము పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది. ఇక్కడ స్వామిని చంద్రుడు ప్రతిష్టించాడు. అందుకే దీనికి సోమారామము అని పేరు వచ్చింది.

5.కుమార భీమారామం

పంచారామాల్లో చివరిదైన కుమారభీమారామము తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంది. ఇక్కడ స్వామిని కాల బైరవుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేశారు. ఈ ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories