మహాశివుని మహిమలు ఎలా ఉంటాయో తెలుసా?

మహాశివుని మహిమలు ఎలా ఉంటాయో తెలుసా?
x
Highlights

మునులంతా కలసి చేసిన వినమ్ర పూర్వకమైన అర్ధింపునకు సూత మహర్షి ఎంతగానో సంతోషించాడు. ''ముని శ్రేష్టులారా !మీరు సామన్యులు కారు. ప్రతి నిమిషం భగవంతుని...

మునులంతా కలసి చేసిన వినమ్ర పూర్వకమైన అర్ధింపునకు సూత మహర్షి ఎంతగానో సంతోషించాడు. ''ముని శ్రేష్టులారా !మీరు సామన్యులు కారు. ప్రతి నిమిషం భగవంతుని ఆరాధనలో తనువూ ,మనసులను విలీనం చేసిన తపస్వులు మీరు. నియమనిష్ఠలతో కూడిన సదాచార సంపన్నులు, సచ్చీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ,ఏది కోరినా అది లోకకళ్యాణం కోసమే అవుతుంది .కాబట్టి మీలాంటి అభిలాష గల వారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే. ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం .కాబట్టి నేనూ కూడా ధన్యుణ్ణే''.అన్నాడు సూతుడు.

మునులు తల పంకించగా సూతమహర్షి ''ఇంత సౌమ్యంగా నన్ను అర్ధించడంలోనే మీరెంత ఉన్నత చరితులో అర్ధం అవుతుంది .అయినా మీ కోరిక సామాన్యమైనది కాదు. ఆదిపురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది గానీ, ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నేకాదు, అభిలాషనూ రేకెత్తిస్తుంది. సనాతనుడు, సనూతనుడు, సదాచారుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. మహాశివుని లీలలు ఎవరికీ అంత తేలిగ్గా అర్ధం కావు. ఆయన గురించి తెలుసుకోవడమంటే ఒకరకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టే ఆయన. ఆయనే సృష్టి.

మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలాగైనా తీరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా, విసిగిపోయి అనుకున్నదాన్ని మధ్యలోనే విడిచిపెట్టకుండా అది తీరేవరకు యత్నిస్తున్నే ఉండాలి. సంకల్పబలం చిత్తశుద్ధి ఉంటే, అది తీరుతుంది. భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమేనని గ్రహించాలి. మార్కండేయునికి అదే జరిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories