నవ నందుల క్షేత్రం ఎక్కడో తెలుసా?

నవ నందుల క్షేత్రం ఎక్కడో తెలుసా?
x
Highlights

మహానంది ఒక గొప్ప శివ క్షేత్రం. కర్నూలు జిల్లాలోని ఈ యాత్రాస్థలం ఒక మండల కేంద్రం కూడా. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది....

మహానంది ఒక గొప్ప శివ క్షేత్రం. కర్నూలు జిల్లాలోని ఈ యాత్రాస్థలం ఒక మండల కేంద్రం కూడా. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడున్న స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీదేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. శివలింగము ఎత్తుగా కాక కొంచెం అణగి వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట జలమే ఒక విశేషం. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం. ఇక్కడి కోనేర్లు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క అత్యద్భుత పనితనాన్ని తెలియజేస్తాయి.

ప్రధాన ఆలయానికి రాజ గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల నుంచి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం కింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము కింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వల్ల పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో అంటే సుమారు 1.7 మీటర్లలో నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ మహనంది క్షేత్రంలో ఊరే ఊట నీరు సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందజేస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories