భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?
x
Highlights

"అన్నం పరబ్రహ్మస్వరూపం" అని ఆర్యవాక్యం. మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని...

"అన్నం పరబ్రహ్మస్వరూపం" అని ఆర్యవాక్యం. మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. "ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసికోననివానికి ఏ కోరికలు ఉండవు" అని చెబుతుంది భగవద్గీత.పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగువైపులా గీతలు (ముగ్గులు) వేసేవారు. దీనివలన

సూక్ష్మక్రిములు భోజన శాలలలోనికి ప్రవేశించేవి కావు. మనుషులను హానిచేసే సూక్షక్రిములులను చంపే శక్తి (పెన్సిలిన్) ఆవుపెడలోనూ, ఆవు మూత్రంలోనూ ఉంది.భోజనం చేసిన తరువాత క్రిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీతితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా వుండేవి.మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్య వంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదుకదా! చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతేకుంటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయటనుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి

వచ్చినపుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు (పాద్యం) ఇస్తారు. తరువాత త్రాగటానికి మంచినీరు ఇస్తారు. "మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను త్రోక్కుతాం. అదే కాళ్ళతో రావటం వల్ల కుటుబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని జరుగుతుంది కదా! ముఖ్యంగా పసిబిద్దలకు మరింత హానిదాయకం" ఇపుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా! కాలిబూట్లతో అన్నం తింటున్నాం.పరుగులు తీస్తున్నాం. "బిజీ!బిజీ!బిజీ!". అనవసరమైన అవసరాలకోసం అర్థంలేని జీవితమ గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవటం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ

అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపికా తీరికా ఎవరికిఉంది?

Show Full Article
Print Article
More On
Next Story
More Stories