ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి.
ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వైష్ణవ దేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవ దేవి కొండలపై నెలకొని ఉంది. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు. ఈ క్షేత్ర ప్రధాన ఆకర్షణ అంటే వైష్ణో దేవి యొక్క మూడు రూపాలు, ఆ రూపాలు జనన మరణాలు ప్రసాదించే మహాకాళి, జ్ఞానాన్ని ఇచ్చే మహాసరస్వతి, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ఇచ్చే మహాలక్ష్మి గా చెపుతారు. ఈ ఆలయాన్ని శ్రీ మాతా వైష్ణో దేవి దేవాలయ బోర్డు నిర్వహిస్తుంటూ వుంటుంది. ప్రతి ఏడాది సుమారు 8 మిలియన్ ల భక్తులు దేశ వ్యాప్తంగా వైష్ణో దేవి టెంపుల్ సందర్శిస్తారు. ఆంద్ర ప్రదేశ్ లోని తిరుమల వెంకటేశ్వర టెంపుల్ తర్వాత ఈ గుడి రెండవ అత్యధిక భక్తులు సందర్శించేది గా చెపుతారు. టెంపుల్ చూడాలనుకునేవారు ఈ ప్రదేశానికి కొంత కాలినడక చేయాల్సివుంటుంది . అంతే కాదు హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని కూడా సంభోదిస్తారు.
వైష్ణో దేవి ఆలయం ఎక్కడ ఉంది
ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్ముకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్ము నుండి 50 కిలో మీటర్ల దూరంలో వున్న కాట్రా ప్రాంతానికి హెలి కాప్టర్లలో వెళ్లవచ్చు. అక్కడి నుండి కాలి నడకన, గుర్రాలమీద, పల్లకిల్లో ఎలాగైన వెళ్లవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ దారి చాల కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవింద అని అరుస్తున్నట్లే ఇక్కడ కూద కొండ ఎక్కేవారు జై మాతాదీ అంటు అరుస్తుంటారు. ఇంకా చాల దూరం వుందనగానే అమ్మవారి ఆలయం కనిపుస్తూనే వుంటుంది. ఈ ఆలయం వున్న ప్రాంతాన్ని భవన్ అని అంటారు.
భక్తులను గ్రూపులుగా విభజించి వారికి ఒక నెంబరిస్తారు. దాని ప్రకారం భక్తులను ఆలయంలోనికి అనుమతిస్తారు. ఆలయంలోపలికి సెల్ ఫోన్లు, కెమరాలు, అలాగే తోలుతో చేసిన ఏ వస్తువును అనుమతించరు. కనుక వాటిని కలిగి వున్నవారు వాటిని అక్కడే లాకర్లలో భద్ర పరుచు కోవచ్చు. వైష్ణో దేవి మూడు రూపాల్లో దర్శనమిస్తుంది. అవి మహాకాళి, మహా లక్ష్మి, సరస్వతి. ఆలయానికి వెళ్లే దారిలో ఇతర పురాతనమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ అమ్మ వారి ఆలయం ఉత్తర భారతాన జమ్ము జిల్లాలోని కాట్రాలో ఉంది. ఈ ఆలయ వార్షికాదాయం ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. పర్వ దినాలలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంక్య లక్షలలో వుండగా కానుకలుగా ఆలయానికి 15 కోట్ల రూపాయలు వచ్చినాయి.
స్థల పురాణం
జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు ప్రారంభించారనే విషయాలు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆ ఆలయంలో పిండీలు అని పిలవబడే మూడు మూర్తులు కొన్ని లక్షల సంవత్సరములుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతముగా ఋగ్వేదములో చెప్పబడిన పర్వతసమూహము ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదములో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుచుండేదని చెప్పబడింది.
వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతములో ఉంది. కురుపాండవ సంగ్రామమునకు ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారము అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతము చెపుతోంది. "జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" అనే శ్లోకము ఆధారముతో ఈ దేవస్థానములోనే అర్జునుడు పూజలు చేసినాడని తెలుస్తుంది.
స్థలపురాణము ప్రకారము పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయ నిర్మాణము చేసినారని తెలుస్తుంది. త్రికూటపర్వతమునకు పక్కన ఐదు రాతి కట్టడములు ఉన్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక జనము భావిస్తారు. మధ్యకాలపు చరిత్ర ప్రకారము మొదటగా సిక్కుల గురువైన గురు గోబింద్ సింగ్ పుర్మండాల్ మీదుగా వచ్చి ఈ పవిత్ర గుహను దర్శించినాడని తెలుస్తుంది. గుహలకు ఉన్న ఒక పాట కాలపు నడక బాట ఈ మార్గము గుండా వెళుతుంది.
ఇక్కడ సతీదేవి యొక్క శిరస్సు పడిన కారణముగా కొన్ని సంప్రదాయములు శక్తిపీఠాలన్నింటిలోనూ ఈ పీఠమును అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తాయి. కొన్ని సంప్రదాయముల వారు మాత్రము అమ్మవారి కుడిచేయి ఇక్కడ పడిందని భావిస్తారు. హైందవ పవిత్ర పుస్తకముల మూలముగా తెలియవచ్చేది ఏమనగా కష్మీరములో అమ్మవారి కుడిచేయి పడిందని. ఇప్పటికీ మాతా వైష్ణోదేవి ఆలయములో మనిషి కుడి చేయి రూపములోని కొన్ని శిల్పములు లభ్యము కావడము ఈ వాదన సరైనదేననడానికి ఊతమిస్తుంది. ఈ చేతి శిల్పమును అమ్మవారి వరద హస్తముగా భక్తులు గౌరవిస్తారు.
శ్రీధరపండితుడు అనే వ్యక్తి 700 సంవత్సరాలకు పూర్వము ఈ కొండగుహలను కనుగొన్నాడని చెపుతారు. తన ఇంటిలోనున్న పూజా సంపుటములో అమ్మవారి విగ్రహం మాయమవడం చూసిన శ్రీధరపండితుడు అమ్మవారికి కటిక ఉపవాసము చేస్తూ మొరపెట్టుకోగా కలలో దర్శనమిచ్చిన అమ్మవారు తను పర్వత సానువులలో ఉన్నానని దారి చూపించిందని, ఉపవాస దీక్ష మానవలసినదిగా ఆదేశించిందని.
ఆమె ఆజ్ఞానుసారము శ్రీధర్ వెతుక్కుంటూ వెళ్ళగా మూడు రాతుల రూపములో అమ్మవారు దర్శనమిచ్చిందని చెపుతారు. ఆ మూడు మూర్తులే మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీ అవతారములుగా శ్రీధరపండితుడు పూజించినాడని చెపుతారు. తరువాత అమ్మవారి ప్రసాదముగా శ్రీధరపండితునికి నలువురు కుమారులు జన్మించినారని, తరువాత శ్రీధరపండితుడు తన శేష జీవితాన్ని అమ్మవారి సేవలో గడిపినాడని ఒక స్థానిక కథ.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire