అద్భుతమైన మృడేశ్వరాలయ రహస్యాలు మీకు తెలుసా ?

అద్భుతమైన మృడేశ్వరాలయ రహస్యాలు మీకు తెలుసా ?
x
Mrudeshwar Temple
Highlights

కర్ణాటక రాష్ట్రం పశ్చిమ తీరప్రాంతంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ మురుడేశ్వర్ ఉంది. అరేబియా సముద్రానికి ఒడ్డునే ఈ దేవాలయం నిర్మించారు.

కర్ణాటక రాష్ట్రం పశ్చిమ తీరప్రాంతంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈ మురుడేశ్వర్ ఉంది. అరేబియా సముద్రానికి ఒడ్డునే ఈ దేవాలయం నిర్మించారు. ఈ ఆలయం పుణ్యక్షేత్రంగానే కాకుండా ఎంతో మంది పర్యాటకుల మదిని దోచే పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. ఈ దేవాలయ రాజగోపురం ఆకాశ మంత ఎత్తులో 20 అంతస్తులతో వుంటుంది. ఆలయంలోకి ప్రవేశించే ద్వారానికి ఇరువైపులా రెండు పెద్ద పెద్ద ఏనుగు విగ్రహాలుంటాయి. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన దైవం శివుడు మురుడేశ్వరునిగా పూజలను అందుకుటాడు. ఈ శివుని విగ్రహం ఎత్తు 123 అడుగులు. ఈ విగ్రహానికి బంగారు పూత పూశారు. ప్రపంచంలోని శివ విగ్రహాలలో రెండవ ఎత్తైన విగ్రహంగా ఇది పేరు గాంచింది.

శివుని విగ్రహం వెనకున్న రహస్యం :

మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం ఆ లింగాన్ని ఎక్కడైనా భూమిమీద ఆ లింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అవుతుందని శివుడు చెపుతాడు. దాన్ని అక్కడి నుంచి కదిలిస్తే ఇంతకింతకు పెరిగి పెద్దదవుతుందని సెలవిస్తాడు శివుడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే దేవతలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని భావించిన దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.

ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషం లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు.ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

పట్టణం లోని ఆకర్షణలు :


మురుడేశ్వర దేవాలయం : ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది. మూడు వైపుల అరేబియా సముద్రం ఆవరించి ఉంది.ఈ దేవాలయ గాలి గోపురం 20 అంతస్తులు ఉంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులు ఉన్నాయి.

మురుడేశ్వర కోట : ఈ కోట మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఉంది. ఈ కోటని టిప్పు సుల్తాను పునరుద్ధరించాడు.

శివుని విగ్రహం : ఆలయ సముదాయంలో నున్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచం లోనే అతి పెద్ద శివుని విగ్రహం. సుందరమైన, పచ్చటి పచ్చిక బయళ్ళతో కల ఒకచిన్న కొండపై శివుడి అతిపెద్ద విగ్రహం ప్రతిష్టించారు. 123 అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టింది. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది. నందీశ్వరుడితో సహా ఈ విగ్రహానికి ఒక దేవాలయం నిర్మించారు. మురుడేశ్వర్ సందర్శించేవారికి ఈ దేవాలయ దర్శనంతో భక్తులు తమను తాము మరచిపోయే రీతిలో ఒక అత్యంత మధురానుభూతిగా ఉంటుంది.

ఇలా చేరుకోవాలి :

రోడ్డు సౌకర్యం: హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుదేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కి.మీ. దూరం తూర్పు వైపు వెడితే మురుదేశ్వర పట్టణం వస్తుంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడ నుండి జాతీయ రహదారి -17 తీసుకొంటే మురుదేశ్వర వస్తుంది.బెంగళూరు నుండి 455 కి.మీ. దూరంలో మురుదెశ్వర వస్తుంది.మంగళూరు నుండి 180 కి.మీ. దూరంలో ఉంది.

రైలు సౌకర్యం: మురుడేశ్వర రైలు స్టేషను కొంకణ్ రైల్వే లైను మీద ఉంది. ఈ రైలు స్టేషనులో ముఖ్యంగా ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుండి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ రైలు ఇక్కడ నిలుస్తుంది. బెంగళూరు నుండి మురుదేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైలు మీద వచ్చి అక్కడ నుండి కొంకణ్ రైల్వే లైను మీద మురుదేశ్వర చేరుకోవచ్చు.

విమాన సౌకర్యం : మురుడేశ్వరకి దగ్గర లోని విమానాశ్రయం మంగళూరు 165 కి.మీ. దూరంలో ఉంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్న వేరే విమానాశ్రయాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories