Live Updates: ఈరోజు (సెప్టెంబర్-23) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు పంచాంగం
ఈరోజు బుధవారం | 23 సెప్టెంబర్, 2020 |శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | అధిక ఆశ్వయుజ మాసం | శుక్లపక్షం | సప్తమి: రా.1-49 తదుపరి అష్టమి | జ్యేష్ఠ నక్షత్రం రా.12-29 తదుపరి మూల | వర్జ్యం: ఉ.7-00 నుంచి 8-31 వరకు | అమృత ఘడియలు: సా.4-07 నుంచి 5-32 వరకు | దుర్ముహూర్తం: ఉ.11-29 నుంచి 12-17 వరకు | రాహుకాలం: ఉ.12-00 నుంచి 1-30 వరకు | సూర్యోదయం: ఉ.5-52 | సూర్యాస్తమయం: సా.5-55
ఈరోజు తాజా వార్తలు
Live Updates
- 23 Sep 2020 3:46 AM GMT
Nellore District updates: మర్రిపాడు మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 30 బస్తాల రేషన్..
నెల్లూరు :--
-అక్రమంగా బద్వేలు కు తరలిస్తున్న 30 బస్తాల రేషన్ బియ్యాన్ని అడ్డగించి, పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.
-30 బస్తాల రేషన్ బియ్యాన్ని వాహనాన్ని స్వాధీనంలోకి తీసుకున్న పోలీసులు.
-డ్రైవర్ తో సహా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
- 23 Sep 2020 3:12 AM GMT
Antarvedi Updates: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది నూతన రథం తయారీ పనులకు ముహూర్తం
తూర్పుగోదావరి
రాజమండ్రి: రానున్న ఐదురోజుల్లో ముహూర్తం చూసి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి నూతన రథం తయారీ పనులకు ముహూర్తం
- అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ
- రావులపాలెం అడితి నుంచి ఆలయ ఆవరణకు చేరుకున్న
- రథం నిర్మాణానికి అవసరమైన బస్తర్ టేకు కలప
- మొత్తం 1,330 ఘనపు అడుగుల బస్తర్ టేకు కలప అవసరమని లెక్కకట్టిన దేవాదాయ శాఖ డీఈ శేఖర్, స్తపతి శ్రీనివాసాచార్యులు
- రావులపాలెంలోని టింబర్ డిపో వద్ద కొనుగోలు చేసి కావాల్సిన సైజుల్లో కోయించి ఆలయానికి తరలింపు
- ఆలయం వద్దకు చేర్చిన కలపకు ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసిన ఆలయ అర్చకులు..
- అంతర్వేది ఆలయ ఏసీ భద్రాజీ
- అంతర్వేది ఆలయం వద్ద కొనసాగుతున్న పోలీసు బందోబస్తు ..పోలీసు ఆంక్షలు
- 23 Sep 2020 3:08 AM GMT
Anantapur Updates: నిబంధనలు పాటించని పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల చర్యలు..
అనంతపురం:
- గతంలో ఇచ్చిన నోటీసులకు సరైన సంజాయిషీ ఇవ్వకపోవడం... మౌలిక వసతుల కల్పన లేకపోవడంతో పలు పాఠశాలలో మూసివేయాలని ఉన్నతాధికారులకు నివేదిక.
- ధర్మవరంలో నారాయణ, శ్రీ చైతన్య, రవీంద్రభారతి, భాష్యం పాఠశాలను మూసివేయాలని ఆర్జేడీకి నివేదిక
- అనంతపురం రామ్నగర్ లో నారాయణ పాఠశాలకు రూ.లక్ష అపరాధ రుసుం విధింపు
- 23 Sep 2020 3:07 AM GMT
Anantapur Updates: ఇంటర్ ప్రథమ సంవత్సరం కి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నేడు ఆన్లైన్లో పరీక్ష :ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య
అనంతపురం:
- ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆన్లైన్ పరీక్ష కు దరఖాస్తు చేసిన విద్యార్థులకు మాత్రమే అవకాశం
- పరీక్ష లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో పుట్టపర్తిలో ముఖాముఖి నిర్వహించి ఎంపిక చేస్తాం:ప్రిన్సిపల్ శివరామకృష్ణయ్య
- 23 Sep 2020 3:04 AM GMT
Yedurappa: నేడు కర్ణాటక ముఖ్యమంత్రి యడియురప్ప తిరుమలకు రాక
- రూ. 200 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కర్ణాటక భవన శంకుస్థాపనకు హాజరువకానున్న సీఎం.
- ఏపీ సీఎం జగన్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్న యడియురప్ప
- కర్ణాటక నుంచి వెళ్లే భక్తులకు ఏకకాలంలో వెయ్యి మందికి సదుపాయం కల్పించే విధంగా కర్ణాటక భవన నిర్మాణానికి భూమి పూజ
- ఇవాళ సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం కానున్న కర్ణాటక సీఎం.
- గురువారం ఉదయం 6:30 గంటలకు జగన్ తో కలిసి తిరుమల కు పయనం.
- శంకుస్థాపన అనంతరం 10 గంటలకు తిరుగు పయనం

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire







