అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుకుంటారు..?

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుకుంటారు..?
x
Highlights

మహిళలు లేనిదే ప్రపంచం లేదు. మహిళలంటే అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి సమాజంలో ఉద్యోగాలు చేయడానికి ఏపాటి అవకాశాలు ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

మహిళలు లేనిదే ప్రపంచం లేదు. మహిళలంటే అవనిలో సగం, ఆకాశంలో సగం అని చెప్పుకుంటాం. కానీ వారికి సమాజంలో ఉద్యోగాలు చేయడానికి ఏపాటి అవకాశాలు ఉంటాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. సృష్టికి మూలం ఆమె అని పూజిస్తాం, గౌరవిస్తాం, గుడులు కడతాం. కానీ ఆడపిల్ల తల్లి గర్భం నుంచి బయటకు రాకుండానే చిదిమేస్తాం. వీటన్నింటిని ఎదుర్కొని వచ్చిన వారు గృహిణిగా, తల్లిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నారు.

మహిళా దినోత్సవం ఏయే దేశాలలో ఎప్పుడు జరుపుకున్నారు.

మార్చి 8 వచ్చిందంటే చాలు మహిళలందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ రోజున మహిళామనులంతా జెండర్‌‌ ఈక్వాలిటీ ప్రచారమే ఉమెన్స్‌‌ డే లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు. ప్రపంచంలోని మహిళలు పురుషులకు సమానంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం చాటుకుంటున్నారు. వివిధ ప్రాంతాలలో మహిళలకు గౌరవం, గుర్తింపు, ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది.

ప్రతి ఏడాది మహిళలు జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టింది.

♦ 1908 మే 3వ తేదీన తక్కువ పనిగంటలు, పనికి తగిన వేతనం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు.

♦ 1909 ఫిభ్రవరి 28న మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది.

రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో నిర్వహించారు. అమెరికా సామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు.

♦ 1911 మార్చి 19న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఇందులో బాగంగా ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో 300 పైగా ప్రదర్శనలు జరిగినవి. వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటుహక్కు, ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.

♦ 1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు.

♦ 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగాయి. అప్పటి నుంచి మార్చి 8ని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ తరువాత అన్ని దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు.

1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం - శాంతి డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. 1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు.

♦ 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు.

♦ 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.

♦ 1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.

♦ 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. సాంకేతికంగా చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగేది 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని, వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.

భారతదేశంలో మహిళా హక్కుల పోరాటం

భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో అనసూయా సారాభాయ్ టెక్స్‌టైల్‌ లేబర్‌ అసోసియేషన్‌ అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్‌, విమలారణదివే, కెప్టెన్‌ లక్ష్మిసెహగల్‌, అహల్యారంగ్నేకర్‌, పార్వతీకృష్ణన్‌ ప్రముఖులు. ఈ పోరాటాల ఫలితంగానే స్వాతంత్య్రం తరువాత కార్మికుల బ్రతుకులు మెరుగయ్యాయి. కార్మికుల పని పరిస్థితులు, వేతనాలు, మహిళా కార్మికుల గురించి చట్టాలను చేయబడినవి. 1991లో ప్రారంభమైన సరళీకరణ విధానాల ప్రభావంవలన ప్రైవేటు రంగం బలపడడంతో మహిళా కార్మికుల చట్టాల అమలు కుంటుబడుతున్నది. దీనికి వ్యతిరేకంగా పోరాటాలలో మహిళలు పాల్గొనడం మరియు నేతృత్వం వహించడం మెరుగుపడవలసివుంది.

యు.ఎస్.ఎ లో అధికారిక గుర్తింపు

మానవహక్కుల ఉద్యమకారిణి, నటి బేతా పోజ్నియక్ మహిళా దినోత్సవంగా అధికారిక గుర్తింపును, ప్రభుత్వ సెలవుదినాన్ని సాధించేందుకు లాస్ ఏంజిల్స్ నగరానికి మేయరు, కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్, యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యులతో కలిసి కృషిచేశారు. 1994లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించేలా బిల్లును రూపొందించడానికి సాకారం చేశారు.

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

2011 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆఫ్ఘన్ మహిళలతో యు.ఎస్. ఆర్మీ అధికారిణి, లుటినెంట్ కర్నల్ పామ్ మూడీ సుమారు వందకు పైగా దేశాలలో ఈ దినోత్సవం జరుపుకున్నారు. 2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి. యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా మార్చి 2011 ని "మహిళల చారిత్రక మాసం"గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా "100 మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు మరియు బాలికల సాధికారత", ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు.

ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు. పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు.

ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- " బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు".

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ "గ్రామీణ మహిళా స్వశక్తీకరణ –ఆకలి పేద రిక నిర్మూలన"ని థీమ్ గా ఎంచుకుంది. 2012 మహిళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్.సి. వారు, సైనిక దళాల్లో చనిపోయిన వారి తల్లుల భార్యల సంక్షేమానికి కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహిళలకు సమాజంలో చాలా ఆర్థిక మరియు సామాజిక సమస్యలు ఎదురవుతుంటాయి. ఐ.సి.ఆర్.సి. వారు, తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యులకి తెలపడం చాలా ముఖ్యమని నొక్కి వక్కాణినించారు.

2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం..

"ప్రమాణం చేసాక వెనుతిరగడం లేదు మహిళలపై హింస నిర్మూలించడం కోసం పని చేద్దాం" అని 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ ని యునిటేడ్ నేషన్స్ వారు ఏర్పరచుకున్నారు. 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఐ.సి.ఆర్.సి. వారు (అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ) జైలులో మగ్గుతున్న మహిళల సమస్యల మిద ఉద్గాటించార.

2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

♦ యునైటెడ్ నేషన్స్ "మహిళా సమానత్వమే అందరికీ హితం" అనే థీమ్ ని 2014 మహిళా దినోత్సవానికి ఎంచుకుంది.

2017 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

రష్యన్ విప్లవానికి 2017 నాటికి శతాబ్ద కాలం పూర్తవుతుంది. 1917 మార్చి 8 లో రష్యన్ మహిళలు బ్రెడ్డు కొరత గురించి సెయింట్ పీటర్స్బెర్గ్ వీధులలో నినదించారు. ఈ సంఘటనలు రెండవ సార్ నిచోలాస్ అభ్యంతరం వలన మార్చి 15న ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2017 మార్చి 8 నాటికి ఇవన్ని పుంజుకోవాలని యోచిస్తున్నారు. వారిలో యుక్రేనియన్ మహిళా కార్యాచరణ సంఘం ఫెమెన్ ముఖ్యమైనది. వారి ముఖ్య ఉద్దేశం మహిళల్ని ఉత్తేజితుల్క్ని చేయడం; సామాజిక పథంలో పాల్గొనేలా చేయడం; ఒక విప్లవం లోకి తీసుకు రావడం.

ప్రపంచవ్యాప్తంగా మహిళల దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు?

ఇటలీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదా 'ల ఫెస్టా డెల్ల డొన్న'ను మిమోసా అనే చెట్టుకు కాసే పువ్వులను బహూకరించి జరుపుకుంటారు. ఈ మిమోసా పువ్వులను పంచే సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో స్పష్టంగా తెలియదు కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రోమ్‌లో ఇది ప్రారంభమైందని భావిస్తుంటారు.

చైనాలో మార్చి 8వ తేదీన స్టేట్ కౌన్సిల్ సిఫార్సు మేరకు చాలా మంది మహిళలకు సగం రోజు పని నుంచి సెలవు లభిస్తుంది. కానీ, ఇంకా కొన్ని సంస్థలు తమ మహిళా ఉద్యోగులకు ఈ సగం పనిదినం అవకాశాన్ని ఇవ్వట్లేదు. మార్చి 8కి ముందు, తర్వాత మూడు నాలుగు రోజుల పాటు రష్యాలో పువ్వుల కొనుగోళ్లు రెండింతలు అవుతుంటాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories