Viral News: ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 ఫైన్ తప్పనిసరి!


Viral News: ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 ఫైన్ తప్పనిసరి!
ఆహార వృథాను అరికట్టేందుకు పుణెలోని ఓ రెస్టారంట్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 అదనంగా చెల్లించాల్సిందేనని కొత్త నిబంధన అమలు చేసింది. దీనికి సంబంధించిన మెనూ బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆహార వృథాను అరికట్టేందుకు పుణెలోని ఓ రెస్టారంట్ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఆహారాన్ని వృథా చేస్తే రూ.20 అదనంగా చెల్లించాల్సిందేనని కొత్త నిబంధన అమలు చేసింది. దీనికి సంబంధించిన మెనూ బోర్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ నెటిజన్ ఈ ఫోటోను ‘ఎక్స్’లో షేర్ చేస్తూ – “పుణెలోని ఓ హోటల్ వృథా ఆహారానికి రూ.20 ఫైన్ వసూలు చేస్తోంది. ప్రతి రెస్టారెంట్, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో ఇలాంటివి అమలు చేస్తే ఆహార వృథా కొంతవరకైనా తగ్గిపోతుంది” అని వ్యాఖ్యానించారు.
ఇక నెటిజన్లు దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు – “ఇది మంచి ఆలోచన, వృథా తగ్గుతుంది” అని అంటుండగా, మరికొందరు – “నచ్చని ఆహారం బలవంతంగా ఎలా తినగలరు?” అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ రెస్టారంట్ తెలిపింది.
A hotel in Pune is charging ₹20 extra if you waste food.
— Ronita (@rons1212) August 13, 2025
Every restaurant should do the same, weddings and functions should start charging fines too! pic.twitter.com/Bw3eU7b58L

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



