Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో 3 ఫార్మాట్లలలో వందే భారత్.. ఏయే రూట్స్‌లోనంటే?

Sleeper Metro and Chair Car Modes in Vande Bharat will Run February March 2024 Says Ashwini Vaishnav
x

Indian Railways: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మరో 3 ఫార్మాట్లలలో వందే భారత్.. ఏయే రూట్స్‌లోనంటే?

Highlights

Vande Bharat Chair Car: రచుగా రైలులో ప్రయాణిస్తున్నారా.. అయితే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లను నడుపుతోంది.

Sleeper Vande Bharat Train: తరచుగా రైలులో ప్రయాణిస్తున్నారా.. అయితే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ వివిధ మార్గాల్లో వందే భారత్ రైళ్లను నడుపుతోంది. రైల్వేస్ వైపు నుంచి స్లీపర్ వందే భారత్ రైలు నడుపుతున్నట్లు గత రోజులలో మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆమోదం తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి వందే భారత్ రైళ్లలో వందే చైర్ కార్, వందే మెట్, వందే స్లీపర్ 3 ఫార్మాట్‌లు ఉంటాయని రైల్వే మంత్రి తెలిపారు.

వందే భారత్ గరిష్ట వేగం గంటకు 160 కి.మీ..

రానున్న కాలంలో శతాబ్ది, రాజధాని, లోకల్ రైళ్ల స్థానంలో వందేభారత్ రైలు వస్తుందని చెప్పారు. ఈ స్వదేశీ 'సెమీ-హై స్పీడ్' రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయి. వందేభారత్ రైళ్ల కోసం గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో రైల్వే ట్రాక్‌లను వచ్చే మూడు, నాలుగేళ్లలో అప్‌గ్రేడ్ చేస్తామని రైల్వే మంత్రి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

మూడు ఫార్మాట్‌లలో వందే భారత్ రైళ్లు..

డెహ్రాడూన్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు వందే భారత్ ప్రారంభించిన అనంతరం, అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 'వందే భారత్ రైలు మూడు ఫార్మాట్‌లను కలిగి ఉంది. వందే మెట్రో 100 కి.మీ కంటే తక్కువ ప్రయాణానికి, వందే చైర్ కార్ 100-550 కి.మీలు, వందే స్లీపర్ 550 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. 2024లో ఫిబ్రవరి-మార్చి నాటికి మూడు ఫార్మాట్‌లు సిద్ధంగా ఉంటాయి. ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రతి రాష్ట్రానికి వందే భారత్ రైలు బహుమతి లభించనుంది.

ఈ రైలు నడపడంతో డెహ్రాడూన్-న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో పట్టే సమయం 6 గంటల 10 నిమిషాల నుండి నాలుగున్నర గంటలకు తగ్గుతుంది. వచ్చే ఏడాది జూన్ మధ్య నాటికి ప్రతి రాష్ట్రానికి వందేభారత్ రైలు బహుమతి లభిస్తుందని వైష్ణవ్ చెప్పారు. ఈ రైళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఎనిమిదవ లేదా తొమ్మిదవ రోజు ఫ్యాక్టరీ నుండి కొత్త రైలు బయలుదేరుతుంది. మరో రెండు ఫ్యాక్టరీల్లో పనులు ప్రారంభం కానున్నాయి.

వందే భారత్‌ను గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో రూపొందించారు. కానీ ట్రాక్ సామర్థ్యం ప్రకారం గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తాయి. పాత ట్రాక్‌లు గంటకు 70 నుంచి 80 కి.మీ వేగంతో ఉండేలా రూపొందించబడ్డాయి. 110 kmph, 130 kmph మరియు 160 kmph వేగంతో దాదాపు 25000-35000 కిమీ ట్రాక్‌లు అప్‌గ్రేడ్ చేయబడుతున్నాయి.

2027-28 నాటికి వందేభారత్ రైళ్లు గంటకు 160 కి.మీ వేగంతో నడపగలవని రైల్వే మంత్రి తెలిపారు. జంతువులు రైళ్లలోకి రాకుండా రైలు పట్టాల వెంట ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. రైల్వేశాఖ ద్వారా 4జీ-5జీ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వైష్ణవ్ తెలిపారు. చాలా చోట్ల వీటిని ఏర్పాటు చేశామని, ఈ పనులు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories