
Viral News: దేశ భక్తిని చాటుకున్న జవాన్.. పెళ్లి కార్డుపై
Viral News: భారతదేశం ఇటీవల పాక్కు గట్టి బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొందరు ఆ సమయంలో పుట్టిన కూతుర్లకు సిందూర్ అని పేరు కూడా పెట్టుకున్నారు.
Viral News: భారతదేశం ఇటీవల పాక్కు గట్టి బుద్ధి చెప్పిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ను దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కొందరు ఆ సమయంలో పుట్టిన కూతుర్లకు సిందూర్ అని పేరు కూడా పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ జవాన్ చేసిన పని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రం సికర్ జిల్లాకు చెందిన అమిత్ సింగ్ అనే ఆర్మీ సైనికుడు తన పెళ్లి ఆహ్వాన పత్రికను ఆపరేషన్ సిందూర్కు నివాళిగా రూపొందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఈ ఆహ్వాన పత్రికలో ముద్రించిన పదాలు చాలా మంది హృదయాలను హత్తుకున్నాయి. "మా గర్వం, మా బలం – ఆపరేషన్ సిందూర్ యోధులు తమ సోదరుడి వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి" అనే మాటలు ఈ పెళ్లికి ఒక ప్రత్యేకతను ఇచ్చాయి. ఇది కేవలం పెళ్లి పత్రిక మాత్రమే కాదు, దేశ సేవ చేస్తున్న కుటుంబం గర్వాన్ని ప్రతిబింబించే ఓ దేశభక్తి సందేశంగా మారింది.
అమిత్ సింగ్ కుటుంబం ఒక వ్యవసాయ కుటుంబమే అయినా, దేశ రక్షణలో పాలు పంచుకుంటూ మిలిటరీలో ముగ్గురు కుమారులను పంపించారు. మే 28న జరగబోయే ఈ వివాహం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం మే 7న 'ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది. ఈ సమయంలో అమిత్ కుటుంబానికి చెందిన ముగ్గురు సైనికులు భారత-పాకిస్తాన్ సరిహద్దుల్లో విధులు నిర్వహించడం విశేషం.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire