-రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ -దాదాపు నెల రోజుల పాటు జరగనున్న సమావేశాలు -పార్లమెంట్లో పెండింగ్లో 43 బిల్లులు
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే రెండో దఫా సమావేశాలివి. అయితే దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో కేంద్రం 35 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వీటిల్లో పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుతో పాటు పౌరసత్వ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. డిసెంబర్ 13వ తేదీతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. పార్లమెంట్లో 43 బిల్లులు పెండింగ్లో ఉండగా... ఈ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం 27 బిల్లులను ప్రవేశపెట్టి... ఆమోదం పొందించేందుకు సిద్ధమవుతోంది.
మరోపక్క పెద్దల సభలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవనుంది. ఇవాళ రాజ్యసభ 250వ సమావేశం ప్రారంభంకానుంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. 1952 మే 13న ఎగువసభ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో చరిత్రాత్మక ఘట్టాలను వివరిస్తూ రాజ్యసభ-1952 నుండి ప్రయాణం పేరిట ప్రచురించిన పుస్తకాన్ని వెంకయ్యనాయుడు విడుదల చేశారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire