Eknath Shinde: సీఎంగా ఏక్‌నాథ్‌ శిండే కొనసాగుతారా?

Will Eknath Shinde Continue as CM
x

Eknath Shinde: సీఎంగా ఏక్‌నాథ్‌ శిండే కొనసాగుతారా?

Highlights

Maharashtra: ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కూలిపోయిన మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం

Maharashtra: మహారాష్ట్రలో రాజకీయం మరోసారి కాక పుట్టిస్తోంది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఇవ్వనుంది. 9 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మార్చి 16న తన తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే కొనసాగుతారా? మరోసారి ఉద్ధవ్‌కు సీఎం పగ్గాలు వెళ్తాయా? శిందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే పరిస్థితేంటి? అన్న ఈ ప్రశ్నలన్నింటికీ సుప్రీంకోర్టు తీర్పుతో సమాధానం రానుంది.

2022 జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా శిందే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ శిందే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పులను వెలువరించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories