West Bengal Elections: బీజేపీకి 200 సీట్లు ఖాయం: ప్రధాని మోదీ

modi On bengal elections
x

మోడీ ఫైల్ ఫోటో 

Highlights

West Bengal Elections: బెంగాల్ లో బీజేపీకి 200 సీట్లు ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు.

West Bengal Elections: బెంగాల్ లో బీజేపీకి 200 సీట్లు ఖాయమని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. తొలి దశ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఊపు వచ్చిందని చెప్పారు. గురువారం జరిగిన ప్రచార సభలో మోడీ మాట్లాడుతూ... రెండో దశ పోలింగ్‌లో ఎక్కడ చూసినా బీజేపీయే కనిపిస్తోందన్నారు. జైశ్రీరాం అన్న నినాదం చేస్తే మమత చిరాకు పడతారని, దుర్గా పూజలు చేసినా అలాగే చికాకు పడతారని ప్రధాని ఎద్దేవా చేశారు. తొలి దశ పోలింగ్ పూర్తైన తర్వాత మమత చికాకు మరింత పెరిగిపోయిందన్నారు. సాయం కోసం అనేక మందికి లేఖలు రాస్తున్నారని, అవుట్ సైడర్స్ మద్దతు కోరుతున్నారని మోడీ సెటైర్లు వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories