
మమతా బెనర్జీ
West Bengal Assembly Election 2021: టీ20 సూపర్ ఓవర్ను తలపిస్తోంది నందిగ్రామ్ కౌంటింగ్.
West Bengal Assembly Election 2021: టీ20 సూపర్ ఓవర్ను తలపిస్తోంది నందిగ్రామ్ కౌంటింగ్. మొదట మమత గెలిచారంటూ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది అంటూ వార్తలు వెలువడ్డాయి. 1,950 ఓట్లతో సువేందు గెలిచాడని జాతీయ మీడియా వెల్లడిచడంతో అంతా అయోమయంలో పడ్డారు. దాంతో ప్రజల తీర్పు గౌరవిస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించారు.
తాజాగా మరోసారి నందిగ్రామ్ ఫలితంపై ఈసీ స్పష్టత ఇచ్చింది. లెక్కించాల్సిన ఓట్లు ఇంకా ఉన్నాయి అని ఈసీ వర్గాలు ప్రకటించాయి. ఇంకా నందిగ్రాం ఫలితం ప్రకటించలేదు అని వెల్లడించింది. నందిగ్రాం ఫలితం రాలేదు అని టీఎంసీ ట్వీట్ చేసింది. ఫలితం ప్రకటించవద్దంటూ టీఎంసీ, ఈసీని కోరింది.
ఇక నందిగ్రామ్ ఫలితంపై మొదటి నుంచి గందరగోళం ఏర్పడింది. ఒకానొక దశలో సువేందు, దీదీ కంటే కేవలం ఆరు ఓట్లు వెనకబడినట్లు ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ తర్వాత కాసేపటికే 17వ రౌండ్ కౌంటింగ్లో మమత 1,200 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఏఎన్పై తెలిపింది. కాసేపటి తర్వాత జాతీయ మీడియా దీదీ ఓడిపోయారంటూ ప్రకటించాయి. సువేందు 1,622 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ప్రకటించాయి. మొత్తానికి నందిగ్రాంలో ఏంజరుగుతుందో తెలియక ప్రజలు సందిగ్ధంలో పడ్డారు.
The counting process for Nandigram has not been completed. Please do not speculate.
— All India Trinamool Congress (@AITCofficial) May 2, 2021

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




