Vice President Election 2025: తొలి ఓటు వేసిన ప్రధాని మోడీ – క్రాస్‌ ఓటింగ్‌తో సంచలనం

పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలివారిగా తన ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం 6 గంటలకు లెక్కింపులు పూర్తయి విజేతను ప్రకటిస్తారు.

Ramya Vegirouthu
Published on: 9 Sept 2025 12:07 PM IST
Vice President Election 2025: తొలి ఓటు వేసిన ప్రధాని మోడీ – క్రాస్‌ ఓటింగ్‌తో సంచలనం
X

Vice President Election 2025: తొలి ఓటు వేసిన ప్రధాని మోడీ – క్రాస్‌ ఓటింగ్‌తో సంచలనం

పార్లమెంట్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తొలివారిగా తన ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. అనంతరం 6 గంటలకు లెక్కింపులు పూర్తయి విజేతను ప్రకటిస్తారు.

ఈ ఎన్నికల్లో NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నిక కొనసాగుతోంది.

ఇక, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది ఓటు వేయనున్నట్లు సమాచారం. జేడీయూ ఎంపీ గిరిధర్‌లాల్ యాదవ్ తన పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఓటు వేయనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కూడా పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా సుదర్శన్ రెడ్డికి కాకుండా రాధాకృష్ణన్‌కు ఓటేయాలని నిర్ణయించుకున్నారు.

Ramya Vegirouthu

Ramya Vegirouthu

Next Story