ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగించాం : కిషన్‌రెడ్డి

ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగించాం : కిషన్‌రెడ్డి
x
Highlights

ఏకాభిప్రాయం తర్వాతే మరోసారి లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అనేక రాష్ట్రాల సీఎంలు కూడా...

ఏకాభిప్రాయం తర్వాతే మరోసారి లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. అనేక రాష్ట్రాల సీఎంలు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధానికి స్వయంగా చెప్పారని, ఆయా రాష్ట్రాల్లో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాయని చెప్పారు. రెడ్‌జోన్ల ప్రాంతాల్లో ఇకపై లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. కొత్తగా పాజిటివ్‌ కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories