స్టేజీపైనే సొమ్మసిల్లిన గడ్కరీ

స్టేజీపైనే సొమ్మసిల్లిన గడ్కరీ
x
Highlights

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షిర్డీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన స్టేజీపైనే సొమ్మసిల్లారు. షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం...

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. షిర్డీలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆయన స్టేజీపైనే సొమ్మసిల్లారు. షిర్డీ లోక్‌సభ నియోజకవర్గం శివసేన అభ్యర్థి సదాశివ్‌ లొఖాండే తరఫున శనివారం సాయంత్రం రహతాలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రచారం నిర్వహించిన ఆయన ప్రసంగం పూర్తి చేసి కుర్చీలో కూర్చోబోతుండగా ఒక్కసారిగా కిందపడబోయారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను కిందకు పడిపోకుండా పట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత కోలుకున్న ఆయన తన కారు వద్దకు ఎవరి సాయం లేకుండానే నడిచి వెళ్లారు. కాగా ఆయన నాగ్‌పూర్‌ ఎంపీగా బరిలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories