Coronavirus: ఇది ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్య : ఆరోగ్య శాఖ మంత్రి

Coronavirus: ఇది ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్య : ఆరోగ్య శాఖ మంత్రి
x
union health minister Dr Harsh Vardhan(File photo)
Highlights

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 41 వేలకు చేరుకుంది. మహారాష్ట్రలో మాత్రమే 13,000 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 41 వేలకు చేరుకుంది. మహారాష్ట్రలో మాత్రమే 13,000 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక్కడ దేశంలో సోకిన మొత్తం కేసులలో చూసుకుంటే 31%. మహారాష్ట్రలో 678, ఢిల్లీలో 427, గుజరాత్‌లో 374, పంజాబ్‌లో 330, ఉత్తర ప్రదేశ్‌లో 158, రాజస్థాన్‌లో 114, మధ్యప్రదేశ్‌లో 49 సహా ఆదివారం 2676 నివేదికలు పాజిటివ్ గా వచ్చాయి. కొత్త రోగుల సంఖ్య వరుసగా మూడవ రోజు అత్యధికంగా ఉంది. శనివారం 2567 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.

ఈ గణాంకాలు covid19india.org, రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. అదే సమయంలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో 40 వేల 263 కరోనావైరస్ కేసులు ఉన్నాయి. 28 వేల 76 మంది చికిత్స పొందుతున్నారు. 10 వేల 887 మందికి నయమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 1306 మంది మరణించారు. గత 24 గంటల్లో కొత్తగా 2487 మంది రోగులు కనిపించగా 83 మంది రోగులు మరణించారు.

ఇదిలావుంటే ప్రస్తుతం పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా రోగులు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు అని అన్నారు. ఇవి కాకుండా ఇంకా చాలా మంది రోగులు కోలుకోనున్నారు. గత 14 రోజులలో, సోకినవారి సంఖ్య రెట్టింపు రేటు 10.5 ఉంటే, ఇది ఇప్పుడు 12 రోజులుకు పడిపోయింది. కరోనా నుండి మరణాలు కూడా 3.2% మాత్రమే ఉన్నాయి.. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ సంఖ్య అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories